English | Telugu

సంద‌డిగా జ‌రిగిన వ‌ర్ష‌-ఇమ్ము పెళ్లి.. ఇమ్ము కాళ్లుక‌డిగిన రామ్‌ప్ర‌సాద్‌!

'జబర్దస్త్' జంటల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ఎంత పాపులారిటీ సంపాదించారో తెలిసిందే. ఈ జంటకు ఆన్ స్క్రీన్ పెళ్లి కూడా చేసేసింది మల్లెమాల సంస్థ. ఇప్పుడు మరో జంట హాట్ టాపిక్ అవుతోంది. వారే ఇమ్మానుయేల్-వర్ష. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఈ జంటకి క్రేజ్ పెరిగింది. పైగా కెమెరా ముందు ఈ జంట తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోంది.

దీంతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో వారు ఇమ్మాన్యుయేల్-వర్షలకు ఆన్ స్క్రీన్ పెళ్లి చేశారు. ఇందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు. "తాజ్‌మ‌హ‌ల్ క‌డితేనే ఆ ప్రేమ‌కు అర్థం. నీ మెళ్లో తాళి క‌డితేనే నా ప్రేమ‌కు అర్థం" అని వ‌ర్ష‌తో డైలాగ్ కొట్టాడు ఇమ్మానుయేల్‌. అబ్బో అన్న‌ట్లు పొంగిపోయింది వ‌ర్ష‌. ఇద్ద‌రూ క‌లిసి పెళ్లి ప‌త్రిక‌ల‌ను ఆహ్వానితుల‌కు పంచారు. భోజ‌నాల త‌ర్వాత పెళ్లి జ‌ర‌ప‌డం ఈ పెళ్లిలోని విశేషం. అయితే సరిగ్గా వర్ష మెడలో ఇమ్మాన్యుయేల్ తాళి కట్టే సమయంలో గెట‌ప్ శ్రీ‌ను ఆధ్వ‌ర్యంలో పోలీసులు వచ్చి పెళ్లి ఆపారు.

"ఏంటిక్క‌డ యాభై మందితో పెళ్లి చేస్తున్నారా?" అని గెట‌ప్ శ్రీ‌ను అడిగితే, "యాభై మందితో చెయ్య‌ట్లేదండీ, ఒక్క‌డితోనే చేశామండీ" అని పంచ్ వేశాడు హైప‌ర్ ఆది. 20 మందికే ప‌ర్మిష‌న్ ఉంటే, 40 మందితో పెళ్లి చేస్తున్నారంటూ, పెళ్లివారిని పోలీస్ స్టేష‌న్‌కు తీసుకుపోయారు. అంద‌రూ పాట‌లు పాడి, డాన్సులు చేసి ఇంప్రెస్ చేయ‌డంతో పోలీసులు వారిని వ‌దిలిపెట్టారు. వేదికపై హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, వర్ష అందరూ కలిసి 'అనితా ఓ అనితా' అంటూ ఓ పాట పాడారు.

పెళ్లి పీట‌ల‌పై ఇమ్మాన్యుయేల్ కాళ్లు క‌డిగాడు రామ్‌ప్ర‌సాద్‌. చివ‌ర‌లో వ‌ర్ష మెడ‌లో ఇమ్ము తాళి క‌ట్టిన‌ట్లు చూపించారు. పెళ్లి వేడుక‌లో ఉండే అరుంధ‌తీ న‌క్ష‌త్రం చూపించ‌డం, ఉంగ‌రాల ఆట, పూల‌బంతాట‌, ఫ‌స్ట్ నైట్‌ వంటివి కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ స్కిట్ ను ప్రమోట్ చేయడానికి వర్ష ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తాళిబొట్టు ఫోటో షేర్ చేసింది. ఈ విషయంలో ఆమెని నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. ఏదేమైనా పెళ్లికూతురు గెట‌ప్‌లో వ‌ర్ష చాలా అందంగా ఉందంటూ కామెంట్లు వ‌చ్చాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.