English | Telugu

'కామెడీ స్టార్స్‌' షోపై సద్దాం సెటైర్లు!

ప్రస్తుతం బుల్లితెరపై మీద ప్రసారమవుతోన్న 'కామెడీ స్టార్స్' షోకి మంచి పాపులారిటీ ఏర్పడింది. రవి, లాస్య, వర్షిణి, అవినాష్, శేఖర్ మాస్టర్ లాంటి వారితో షోని బాగానే నెట్టుకొస్తున్నారు. అయితే ఇదే షోలో 'అదిరింది' బ్యాచ్ కూడా దూసుకుపోతోంది. 'పటాస్' నుండి 'అదిరింది' షోకి షిఫ్ట్ అయిన 'గల్లీ బాయ్స్' మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే ఆ షో ఆగిపోవడంతో వారంతా 'కామెడీ స్టార్స్'లోకి వచ్చి చేరారు.

తాజాగా సద్దాం వేసిన స్కిట్.. దానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. యమలోకంలోకి వెళ్లిన సద్దాం.. భూలోకంలో తాను పడిన బాధల గురించి యముడికి చెబుతూ 'ఎంత పెద్ద శిక్ష వేశారు?' అంటూ ప్రశ్నిస్తుంటాడు. ఈ క్రమంలో తనదైన స్టైల్ లో పంచ్ లు వేశాడు. పనిలో పనిగా జడ్జ్ లు శేఖర్ మాస్టర్, శ్రీదేవిలను కూడా టార్గెట్ చేశాడు. ఎంకరేజ్ చేయడానికైనా పదికి పది మార్కులు ఇవ్వరని.. ఎంత బాగా చేసినా తొమ్మిది మార్కులే ఇస్తుంటారని అన్నాడు.

అలానే 'కామెడీ షో' నిర్వాహకులపై సెటైర్లు వేశాడు. మాములుగా అయితే స్కిట్ కోసం గంట ముందు మాత్రమే ప్రిపేర్ అవుతానని.. అలాంటిది రెండు రోజుల ముందు నుండే ప్రాపర్టీస్ చెప్పమని నిర్వాహకులు అడుగుతున్నారని అన్నాడు. వాళ్లిచ్చిన ప్రాపర్టీస్‌తో స్కిట్ డిజైన్ చేసుకోవాల్సి వస్తోందంటూ కౌంటర్ వేశాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.