Read more!

English | Telugu

11 స‌ర్జ‌రీలు.. చావు బ్రతుకుల మధ్య టీవీ నటి!

 

బుల్లితెరపై 'స్వాతి' అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శరణ్య శశి. ఈ సీరియల్ లో తన అందంతో పాటు అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా గడిపింది. అక్కడ కూడా ఈమెకి మంచి పేరే దక్కింది. మలయాళంలో ఈమె నటించిన ఓ సీరియల్ కు ఉత్తమ నటి కేటగిరీలో అవార్డుని కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ నటి చావు బ్రతుకుల మధ్య అల్లాడుతోందని సమాచారం. 

ఈ విషయాన్ని శరణ్య స్నేహితురాలు, తోటి నటి సీమా నాయర్ వెల్లడించింది. శరణ్య మంచి నటిగా రాణిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని.. అప్పటినుండి ఆమె మంచానికే పరిమితమైందని.. ట్రీట్మెంట్ అందిస్తున్నా కోలుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు శరణ్యకు 11 సర్జరీలు జరిగాయట. అయినప్పటికీ ఆమె కోలుకోలేదని.. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని సీమా నాయర్ తెలిపింది. 

ఓ వ్యాధి ఆమె వెన్నెముక నుండి శరీరమంతా పాకుతున్నట్లు వైద్యులు తెలిపారని సీమా చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే ఆమె ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతుంద‌ని.. అలాంటి సమయంలో శరణ్య తల్లి, సోదరుడికి కరోనా సోకడంతో హాస్పిటల్ పాలయ్యారని.. దీంతో శరణ్య ఆరోగ్యం మరింత దారుణంగా త‌యార‌వుతోందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సీమా నాయర్.