English | Telugu

11 స‌ర్జ‌రీలు.. చావు బ్రతుకుల మధ్య టీవీ నటి!

బుల్లితెరపై 'స్వాతి' అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శరణ్య శశి. ఈ సీరియల్ లో తన అందంతో పాటు అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా గడిపింది. అక్కడ కూడా ఈమెకి మంచి పేరే దక్కింది. మలయాళంలో ఈమె నటించిన ఓ సీరియల్ కు ఉత్తమ నటి కేటగిరీలో అవార్డుని కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ నటి చావు బ్రతుకుల మధ్య అల్లాడుతోందని సమాచారం.

ఈ విషయాన్ని శరణ్య స్నేహితురాలు, తోటి నటి సీమా నాయర్ వెల్లడించింది. శరణ్య మంచి నటిగా రాణిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని.. అప్పటినుండి ఆమె మంచానికే పరిమితమైందని.. ట్రీట్మెంట్ అందిస్తున్నా కోలుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు శరణ్యకు 11 సర్జరీలు జరిగాయట. అయినప్పటికీ ఆమె కోలుకోలేదని.. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని సీమా నాయర్ తెలిపింది.

ఓ వ్యాధి ఆమె వెన్నెముక నుండి శరీరమంతా పాకుతున్నట్లు వైద్యులు తెలిపారని సీమా చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే ఆమె ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతుంద‌ని.. అలాంటి సమయంలో శరణ్య తల్లి, సోదరుడికి కరోనా సోకడంతో హాస్పిటల్ పాలయ్యారని.. దీంతో శరణ్య ఆరోగ్యం మరింత దారుణంగా త‌యార‌వుతోందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సీమా నాయర్.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.