English | Telugu

'జబర్దస్త్' ఆర్టిస్ట్ పేరుతో ఫేక్‌ అకౌంట్! హెచ్చ‌రించిన త‌న్మ‌యి!!

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. అందులో ఖాతాలు లేని వారెవరూ ఉండరు. సెలబ్రిటీల నుండి సాధారణ ప్రజల వరకు ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటున్నాయి. అయితే కొందరు కేటుగాళ్లు మాత్రం నకిలీ ఖాతాలతో రెచ్చిపోతున్నారు. ఇది సెలబ్రిటీలకు అప్పుడప్పుడు తలనొప్పిగా మారుతుంటుంది. ఇప్పుడైతే వెరిఫైడ్ అకౌంట్ అనే ఆప్షన్ రావడంతో సెలబ్రిటీల అకౌంట్లను సులువుగా పోల్చే అవకాశం ఉంది.

అయితే కొందరు సెలబ్రిటీలకు బ్లూ టిక్స్ ఉండవు. సాధారణ వ్యక్తుల మాదిరి వారి ఖాతాలు ఉంటాయి. అలాంటి వారిని ఆకతాయిలు టార్గెట్ చేస్తున్నారు. కొందరు హ్యాకింగ్‌లకు పాల్పడుతుంటే.. ఇంకొందరు నకిలీ ఖాతాలతో జనాలను బురిడీ కొట్టిస్తుంటారు. తాజాగా 'జబర్దస్త్' షోలో లేడీ గెటప్పులతో ఫేమస్ అయిన తన్మయికి ఆకతాయిలు షాకిచ్చారు.

ఆమె పేరుతో ఓ నకిలీ ఖాతాను ఓపెన్ చేశారు. దీంతో ఆ ఖాతా త‌న్మయిదే అనుకొని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయం తన్మయికి తెలియడంతో తన అభిమానులను హెచ్చరించింది. ఆ ఫేక్ అకౌంట్ డీటైల్స్ షేర్ చేస్తూ.. ఇది నకిలీ ఖాతా అని ఎవరూ నమ్మొద్దని చెప్పింది. చాట్ చేయొద్దని తన ఫాలోవర్లకు సూచించింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.