English | Telugu

ప్రియ‌మ‌ణికి హైపర్ ఆది లవ్ లెటర్.. చదివి వినిపించిన ప్రదీప్!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై షోలు బాగా పెరిగిపోయాయి. వెండితెర స్టార్స్ సైతం టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాబోయే బుధవారం టెలికాస్ట్ కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. యాంకర్లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్ లతో పాటు జడ్జిలు ప్రియమణి, పూర్ణ చేసిన హడావిడి మాములుగా లేదు.

ఓ కంటెస్టెంట్ డాన్స్ పెర్ఫార్మన్స్ కు ముగ్ధురాలైన‌ పూర్ణ నేరుగా స్టేజ్ పైకి వెళ్లి అతడి బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఇక హైపర్ ఆది రాసిన లవ్ లెటర్ ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది. ఈ లెటర్‌ను ప్రదీప్ చదివి వినిపించాడు. స‌హ‌ యాంకర్ దీపికను ఉద్దేశిస్తూ ఆది లెటర్ రాశాడు. ''దీపికా దీపికా నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపిక..'' అంటూ కౌంటర్లు వేశాడు. అలానే ప్రియమణిని ఉద్దేశిస్తూ.. "ప్రియా నిన్ను చూడగానే పడిపోయా.." అంటూ రాసిన కవితను ప్రదీప్ తన స్టైల్ లో చదివి నవ్వించాడు.

ఆదితో పాటు సుడిగాలి సుధీర్ కూడా లవ్ లెటర్ రాశాడు. ఆ లెటర్ ను చూడాలని ఉందా..? అంటూ ప్రదీప్ ఆసక్తికి క్రియేట్ చేశాడు. ప్రోమోలో అయితే లెట‌ర్‌ను వినిపించలేదు. సుధీర్ ఏం రాశాడో తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాల్సిందే! మొత్తానికి ఇలాంటి ఆస‌క్తిక‌ర స్కిట్స్‌తో ఢీ 13 దూసుకుపోతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.