English | Telugu

భార్య ఆరోగ్యంపై బిగ్ బాస్ కౌశల్ ఎమోష‌న‌ల్‌ పోస్ట్.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. రెండో సీజన్ విన్నర్ గా కంటే పలు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచేవాడు. పీఎం ఆఫీస్ నుండి కాల్ వచ్చిందని, గిన్నిస్ రికార్డ్ కోసం అడిగారని ఇలా గొప్పలు చెప్పుకోవడంతో అతడి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇది కాకుండా.. కౌశల్ ఆర్మీలో కొందరు సభ్యులు అతడికి వ్యతిరేకంగా మారడంతో వ్యవహారం బాగా ముదిరిపోయింది.

కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులు వృధా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. చెప్పినట్లుగా కౌశల్ డబ్బులను ఫౌండేషన్ కు ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వార్తలతో అతడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేవాడు. కౌశల్ తో పాటు అతడి భార్య నీలిమపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. మొన్నామధ్య నీలిమ ఆరోగ్యం గురించి కౌశల్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తన భార్యకు ఆరోగ్యం బాలేదని మీడియా ముందు చెప్పాడు కౌశల్.

నీలిమకు గతంలో ఓ సర్జరీ కూడా జరిగింది. అయితే తాజాగా కౌశల్ తన భార్యను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''ఏదో సాధించేందుకు వెళ్లావ్.. దాని కోసం నువ్ నీ జీవితంతో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో నువ్ అనుకున్నది సాధిస్తావ్ అని నాకు తెలుసు.. త్వరగా కోలుకొని రా.. నువ్ కన్న కలల కోసం పోరాడు.. లవ్యూ.. మిస్ యూ'' అంటూ కౌశల్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన కౌశల్ అభిమానులు.. వదినకు ఏమైందంటూ కౌశల్ ని ప్రశ్నిస్తున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.