English | Telugu

ఝాన్సీ మేక‌ప్‌మేన్ ఎంత మంచివాడంటే...

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఉపాధిని కోల్పోయి.. తినడానికి తిండి లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు.

ఇందులో భాగంగా యాంకర్ ఝాన్సీ తనకు వీలైనంతలో కొంతమందికి నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ఈ మేరకు తన టీమ్ తో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తన మేకప్‌మేన్‌, టచప్ అసిస్టెంట్ రమణ చేస్తోన్న మంచి పనుల గురించి చెప్పుకొచ్చారు. వారికోసం ఇచ్చిన డబ్బులను కూడా ఇతరుల కోసమే వాడుతున్నారని ఝాన్సీ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

''నాకు వీలైనంతలో ఒక పాతిక మందికి నెల సరుకులు ఇచ్చే పనిని రమణ దగ్గరుండి చూసుకున్నాడు. అందులో చిన్న మొత్తం మిగిలింది. అది నీ దగ్గరే ఉంచు రమణా అని చెప్పినా కూడా అతడు తనకు ఇబ్బంది లేదని చెప్పి అవసరం ఉన్న మరో నలుగురికి నిత్యావసర సరుకులు అందించాడు. మంచితనం డబ్బుతో రాదు.. మా శ్రీను, రమణ జన్మతః గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తులు. వీరితో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.