English | Telugu
`దేవత`: ఆదిత్యకు షాకిచ్చిన రాధ
Updated : Nov 23, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ దేవత. శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ల కలయికలో వచ్చిన `దేవత` కాన్సెప్ట్నే తీసుకని దానికి నాటకీయ పరిణామాల్ని పజోడించి కొత్త పంథాలో కాస్త భిన్నంగా కుటుంబ భావోద్వేగాల్ని జోడించి ఈ సీరియల్ని రూపొందించారు. `చంటిగాడు` ఫేమ్ సుహాసిని, అర్జున్ అంబటి, వైష్ణవీ రామిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమించిన వాడిని అక్క కోసం త్యాగం చేసే ఓ చెల్లెలు కథ.. చెల్లెలు త్యాగాన్ని తెలుసుకుని తన జీవితాన్నే త్యాగం చేసిన ఓ అక్క కథగా ఈ సీరియల్ని రూపొందించారు.
గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న దేవత ఈ రోజు 398వ ఎపిసోడ్లోకి ప్రవేశించింది. ఈ మంగళవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగబోతోంది. తనని వెతుక్కుంటూ వచ్చిన ఆదిత్యతో తనకు పెళ్లైందని చెబుతుంది రాధ. ఈ విషయం ఆదిత్యని షాక్కు గురిచేస్తుంది. ఇదిలా వుంటే రాధ, మాధవ్లు కలిసి ముడుపు కడితే వాల్లు భార్యభర్తలేనని లేదంటే కాదని ఆదిత్యతో రమ్య అంటుంది. రాధ తన కూతురు దేవి కోసం మొక్కు తీర్చడానికి ముడుపు కట్టేందుకు మాధవ్, రాధ గుడికి వస్తారు.
తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మాధవ్తో కలిసి ముడుపుకట్టేందుకు రాధ ముందుకు వస్తుంది. ఇద్దరు కలసి ముడుపు కట్టేందుకు ముందుకొస్తారు. ఇదే సమయంలో మాధవ్కు కళ్లు తిరగడంతో ముడుపు వదిలేస్తే రాధే కట్టేస్తుంది. కానీ దూరం నుంచి చూస్తున్న ఆదిత్య, రమ్యలతో పాటు జానకి, రామ్మూర్తిలకు మాత్రం రాధ, మాధవ్లు కలిసి ముడుపు కడుతున్నాట్టుగా కనిపిస్తుంది. అది చూసిన ఆదిత్య ఎలా రియాక్ట్ అయ్యాడు? .. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.