English | Telugu

అద‌ర‌గొట్టిన 'డాన్స్ ప్లస్' గ్రాండ్ ఫినాలే.. విన్నర్ ఎవరంటే..?

బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలకు కొదవ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో కొత్త షోలను లాంచ్ చేస్తుంటారు. ప్రతీ ఛానెల్ లో ఎంటర్టైన్మెంట్ షోలు వస్తూనే ఉన్నాయి. డాన్స్, సింగింగ్, కామెడీ అంటూ ఎన్నో షోలను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మాలో 'డాన్స్ ప్లస్' షో అనే షో మొదలైంది. గతేడాది 'బిగ్ బాస్' షో ముగిసిన తరువాత ఈ షో మొదలైంది. ఓంకార్ గా హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోలో కొరియోగ్రాఫ‌ర్స్ యానీ, రఘు, యశ్, బాబా భాస్క‌ర్‌, తార‌లు ముమైత్ ఖాన్, మోనాల్ గజ్జర్ న్యాయనిర్ణేతలుగా కనిపించారు.

దాదాపు 21 వారాలుగా సాగిన ఈ షో ఆదివారం నాటి ఎపిసోడ్ తో ముగిసిపోయింది. గ్రాండ్‌ ఫినాలేకు శేఖర్ మాస్టర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఫైనల్ గా వాసి టోనీ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), సంకేత్‌ సహదేవ్‌ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్‌ బృందం), జియా ఠాకూర్ (యానీ మాస్టర్‌ బృందం), డార్జిలింగ్‌ డెవిల్స్‌ (రఘు మాస్టర్‌ బృందం) పోటీపడ్డారు.

కంటెస్టెంట్ లందరూ కూడా డిఫరెంట్ స్టైల్స్ లో డాన్స్ చేసి మెప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఫైనల్ గా సంకేత్ సహదేవ్ విన్నర్ గా నిలిచి ట్రోఫీ అందుకున్నాడు. అంతేకాదు రూ. 20 లక్షలు బహుమతిగా గెలుచుకున్నాడు. ట్రోఫీని శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా సంకేత్ కు అందించారు. మొత్తానికి ఈ షో వ‌ల్ల ఓంకార్‌ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా.. అన్నీ పక్కన పెట్టి స‌క్సెస్‌ఫుల్‌గా షోను పూర్తి చేయగలిగారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.