English | Telugu

మ‌ళ్లీ మ‌నం క‌లుసుకునేదాకా.. న‌వ్వులు పంచుతూనే ఉంటాను నాన్నా!

బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఇటీవల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?' అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో బ్లాక్‌బ‌స్ట‌ర్ కాక‌పోయినా బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలైతే క‌లిగించ‌లేదు. లేటెస్ట్‌గా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. ప్ర‌దీప్‌ ఎప్పటిలానే యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా ప్రదీప్ బ‌య‌ట‌ ఎక్కడా కనిపించడం లేదు. ప్రదీప్ కుటుంబం కరోనాతో కుంగిపోయింది.

ప్ర‌దీప్ తండ్రి పాండురంగ మాచిరాజు (65) క‌రోనాతో పోరాడుతూ మే 1న మృతి చెందారు. అప్ప‌టికి ప్ర‌దీప్ సైతం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణై క్వారంటైన్‌లో ఉన్నాడు. తండ్రితో అత్యంత స‌న్నిహితంగా మెలిగే ప్ర‌దీప్‌కు అది తీవ్ర శ‌రాఘాతం. ఆ బాధ నుండి ప్రదీప్ ఇంకా బయటకురాలేదు. మొదటిసారిగా ప్రదీప్ తన తండ్రి మరణంపై ఎమోష‌న‌ల్‌గా స్పందించాడు. త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన ఓ నోట్‌లో అత‌డు రాసిన మాట‌లు తండ్రిపై అత‌డి ప్రేమ‌కు అద్దం ప‌డ‌తాయి. అందులో "మిమ్మ‌ల్ని క‌లుసుకొనేదాకా ప్ర‌జ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉంటాను, న‌వ్వులు పంచుతూనే ఉంటాను." అంటూ రాసిన మాట‌లు అంద‌రి హృద‌యాల్నీ స్పృశిస్తున్నాయి. ఆ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

''ఐ లవ్ యూ నాన్న, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా చిరునవ్వుతో ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఇక నుంచి నేనేం చేసినా మీకు గౌరవం కలిగించేలా పని చేస్తాను. మీ జీవితానికి ఒక అర్థం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా మీరు నా వెంటే నిలబడ్డారు. ముక్కలైన నా మనస్సును ఎన్నో సార్లు బాగు చేశారు. అలాగే నా కాళ్ల మీద నన్ను నిలబడేలా చేశారు. మీరు నాకు ఎప్పటికీ స్పెషల్. మీరు కోరుకున్నట్లుగానే నా జీవితంలో నేను జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్లకు నవ్వులు పంచుతూనే ఉంటాను.. మ‌నం మ‌ళ్లీ క‌లుసుకునే దాకా.. మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాను నాన్న'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.