English | Telugu

ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా మారిన డాన్స్ షో కంటెస్టెంట్‌.. అంత‌లోనే యాక్సిడెంట్‌!

హిందీ బుల్లితెరపై 'డాన్స్ ఇండియా డాన్స్' షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ షోలో న్యాయనిర్ణేతలుగా అప్పుడప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపిస్తుంటారు. అయితే ఈ షో లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బికీ దాస్ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యాడు. గత శుక్రవారం బైక్ మీద వెళ్తున్న బికీ దాస్ మరో బైక్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడి పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బికీ దాస్ ను హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మీద బికీ దాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా.. బికీ దాస్ 2014లో ప్రసారమైన 'డాన్స్ ఇండియా డాన్స్' నాల్గో సీజన్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన డాన్స్ స్టెప్పులతో చాలా మందికి ఫేవరెట్ గా మారాడు. ఫైనల్స్ లో మాత్రం రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ షో తరువాత అతడి సినిమాల్లో అవకాశాలు రాకాపోవడంతో.. పలు ఈవెంట్స్ చేసుకుంటూ, కొన్ని షోలలో మెంటర్ గా కనిపిస్తూ జీవనం సాగించాడు. కరోనా కారణంగా అతడికి ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారం క్రితమే ఆయన ఫుడ్ డెలివెరీ బాయ్ గా జాయిన్ అయ్యాడు. కోల్‌కతాలో ఫుడ్ డెలివర్ చేస్తోన్న సమయంలో అతడికి యాక్సిడెంట్ జరిగింది. మరి ఇప్పటికైనా సినీ పెద్దలెవరైనా బికీ దాస్ కు సాయం అందిస్తారేమో చూడాలి!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.