English | Telugu
Brahmamudi : నగలు దొంగతనం చేసింది రాహుల్.. అప్పు, స్వప్నల ఇన్వెస్టిగేషన్ షురూ!
Updated : Jul 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -765 లో.... రాజ్ కి బాస్ లాగా ట్రైనింగ్ ఇస్తుంది కావ్య. అందరిలో ఆఫీస్ లో ఎలా నడవాలి.. ఎలా తినాలి.. ఇలా ప్రతీది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా రుద్రాణి చూసి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రాజ్ ఆఫీస్ కి రాకుండా చేయమని యామినికి చెప్తుంది రుద్రాణి. మరొకవైపు స్వప్న దగ్గరికి అప్పు వస్తుంది. అక్క నీకు ఎలా కనిపిస్తున్నాను.. గిల్టీ నగలు ఇచ్చి నన్ను మెరుగు పెట్టించమని ఇచ్చావని అప్పు అనగానే స్వప్న షాక్ అవుతుంది.
ఏం మాట్లాడుతున్నావే అవి తాతయ్య గారు ఇచ్చిన ఏడు వరాల నగలు అని స్వప్న అనగానే.. చూడు ఒకసారి వీటిని ఒరిజినల్ నగలు అంటారా అనగానే స్వప్న వాటిని చూసి షాక్ అవుతుంది. రాహుల్ నగలు లోపల పెట్టేటప్పుడు చూసింది గుర్తు చేసుకొని అసలు రాహుల్ ఆల్రెడీ నగలు తీసుకొని గిల్టీ నగలు పెడుతుండగా చూసా కానీ అప్పుడు నగలు దొంగతనం చేస్తున్నాడని గొడవ అయిందని స్వప్న అంటుంది. నా మొగుడు ఎలాంటి వాడో చూసావా అని స్వప్న బాధపడుతుంది. అసలు రాహుల్ నగలు తియ్యాల్సిన అవసరం ఏంటి? మనం ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని అప్పుతో స్వప్న అంటుంది. మరొకవైపు కావ్యతో రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు.
ఆ తర్వాత స్వప్న కావాలనే లాకర్ కీస్ రాహుల్ కి కనపడేలా పెడుతుంది. కావాలనే అప్పుతో ఫోన్ లో మాట్లాడినట్లు చేస్తుంది. అప్పు నాతో మాట్లాడాలి అంట నేను వెళ్తున్నాను.. పాపని చూడమని రాహుల్ తో స్వప్న అనగానే రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్వప్న వెళ్ళగానే లాకర్ నుండీ ప్రాపర్టీ పేపర్స్ తీసుకొని రాహుల్ వెళ్తాడు. అదంతా అప్పు, స్వప్న చూస్తారు. అసలు రాహుల్ ఏం చేస్తాడో చూడాలని ఇద్దరు అనుకుంటారు. మరుసటి రోజు రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. రాజ్ రాగానే శృతి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.