English | Telugu

బిగ్ బాస్ సీజన్ 5 లేటెస్ట్ అప్డేట్!

బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. నిజానికి మే నెలలో ఈ షోను మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే షోని చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు.

ఇక ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో బిగ్ బాస్ షోను జూలైలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సెలబ్రిటీల లిస్ట్ కూడా రెడీ చేశారట. ఇప్పుడు వాళ్లకు జూమ్ వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారని సమాచారం. రోజుకి ముగ్గురు చొప్పున 'మా' యాజమాన్యం కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూలు చేస్తుందట.

మరో వారం రోజుల్లో ఫైనల్ లిస్ట్ ను రెడీ చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందుకు కంటెస్టెంట్ లందరినీ హోమ్ క్వారెంటైన్ కు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి రెండు వారాల ముందుగానే ఈ ప్రాసెస్ ను మొదలుపెట్టాలి. ఈసారి ప్రైజ్ మనీను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మూడు, నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున ఐదో సీజ‌న్‌కు కూడా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.