English | Telugu

బిగ్ బాస్ డ‌బ్బుతో సొహేల్ క‌ల నిజ‌మాయెగా!

బుల్లితెర‌పై మొద‌ట చిన్న పాత్ర‌ల్లో న‌టించి, 'కృష్ణ‌వేణి' లాంటి సీరియ‌ల్‌లో హీరోగా రాణించిన‌ ఇస్మార్ట్ స‌య్య‌ద్ సొహేల్ బిగ్‌బాస్ త‌రువాత క‌థ వేరేగానే వుంది. సీజ‌న్ 4లో టాప్ 5లో నిలిచిని సోహైల్ త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌తో... ఆక‌ట్టుకునే డైలాగ్‌ల‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దృష్టిలోప‌డిన సొహేల్‌ చిరు నుంచి బంప‌ర్ ఆఫ‌ర్‌తో పాటు ఆయ‌న భార్య స్వ‌యంగా చేసిన బిర్యానీని కూడా ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

త‌ను చేసే సినిమాలో చిన్న గెస్ట్ పాత్ర అయినా తాను చేస్తాన‌ని మెగాస్టార్ చిరంజీవి.. ఇస్మార్ట్ సొహేల్‌‌కు బిగ్‌బాస్ ఫైన‌ల్ స్టేజ్ సాక్షిగా మాటివ్వ‌డంతో అత‌ని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అంత‌కు ముందు సింగ‌రేణి ముద్దు బిడ్డ అంటూ షోలో హ‌ల్‌చ‌ల్ చేసిన సొహేల్‌ టాప్ 3కి వ‌చ్చేసరికి తెలివిగా ప్ర‌వ‌ర్తించి 25 ల‌క్ష‌ల క్యాష్‌తో ఇంటిదారి ప‌ట్ట‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.

బిగ్‌బాస్ హౌస్‌‌లోనే కాదు, హౌస్‌ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక కూడా సొహేల్‌ క‌థ వేరేగానే వుంది. హీరోగా ఓ సినిమాని ప్ర‌క‌టించిన సోహైల్ తాజాగా ఎంజీ హెక్ట‌ర్ కారుని సొంతం చేసుకున్నాడు. తండ్రి, త‌మ్ముడితో క‌లిసి షోరూమ్‌కి వెళ్లిన సొహేల్‌ ఎంజీ హెక్ట‌ర్ కారుని కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ. 30 లక్ష‌లు అని తెలిసింది. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు సొహేల్‌.

"ఫైన‌ల్లీ.. కొత్త కారు కొనాల‌నే ఒక క‌ల నిజ‌మైంది. దీన్ని సాధ్యం చేసిన బిగ్ బాస్‌కు, ఎప్పుడూ నాకు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన మా నాన్న‌కు థాంక్స్‌. హ‌లో ఎంజీ." అని వాటికి క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.