English | Telugu

యాంకర్ అనసూయ నా బిగ్ ఇన్​స్పిరేషన్

బుల్లితెర మీద యాంకర్ గా వైరల్ వంటలక్కగా ఫేమస్ ఐన ధరణి ప్రియా గురించి అందరికీ తెలుసు. ఆమె కొన్ని షోస్ లో చేస్తూ ఉంటుంది. కొన్ని షోస్ ని హోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ధరణి ఒక చిట్ చాట్ లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను చెప్పుకొచ్చింది.

"నేను పక్కా హైద్రాబాదీ పిల్లను. ఘట్ కేసర్ మాది. బిటెక్ చదివే టైములో కాలేజీ డేస్ లాంటి షోస్ ఉండేవి కదా. కాలేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల షోస్, చిట్ చాట్స్ జరిగేవి, కొన్ని గేమ్స్ లాంటివి కండక్ట్ చేసేవాళ్ళు. నేను డాన్స్ లో నంబర్ 1 కాబట్టి అంటే అనుకుంటూ ఉంటాను అలా నా డాన్స్ చూసిన ఒక ప్రోగ్రాం ప్రొడ్యూసర్ మీరు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మీరు యాంకర్ గా ట్రై చేయొచ్చు అన్నారు.

ఇక వచ్చింది నా టైం అనుకుని నా కెరీర్ ని స్టార్ట్ చేసాను. ఒక లోకల్ ఛానల్ లో వీడియో జాకీగా ఎంట్రీ ఇచ్చాను. షూటింగ్ ఐపోయాక ఇంటికి వెళ్లి మా ఆయన భుజం మీద తలపెట్టి పడుకోవాలని అనుకుంటాను. అప్పుడు ఆ పని చేయి ఈ పని చెయ్యి అంటూ ఇరిటేట్ చేస్తాడు. నాకు కోపం తెప్పించడానికి రీజన్స్ వెతుకుతాడు అదే నాకు నచ్చదు. కెమెరాకి దూరంగా ఉండొద్దు అనే రిజల్యూషన్ ని ఈ ఇయర్ తీసుకున్నాను. ఇది నా టైం కాబట్టి నేను కెమెరాకు దూరంగా ఉండకూడదు, చాలామంది మెప్పు పొందాలి అనుకుంటున్నాను.

ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ యాంకర్ అనసూయ నా బిగ్ ఇన్స్పిరేషన్ . చాలా సపోర్ట్ చేసింది. తన కజిన్ కావడం నిజంగా గర్వంగా ఉంటుంది. 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాక ఇప్పుడు వైరల్ వంటలక్క షోతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆదర్శ్ తో కలిసి "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి డాన్స్ చేసాను. మా పెయిర్ కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆదర్శ్ నాకు డాన్స్ లో బెస్ట్ కో-స్టార్. నా డ్రీం రోల్ బెస్ట్ యాంకర్ గా చేస్తూ ఉండాలి..డబ్బు కన్నా మనిషే గొప్ప. డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించొచ్చు కానీ మనిషిని సంపాదించలేము" అంటూ చెప్పుకొచ్చింది ధరణి ప్రియా.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.