English | Telugu

కూతురికి పేరు పెట్టిన హ‌రితేజ‌.. ఆ పేరే ఎందుకంటే..!!

బుల్లితెరపై సీరియల్స్‌తో ఫేమస్ అయిన హరితేజ ఆ తరువాత సినిమా అవకాశాలు దక్కించుకుంది. బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయిన తరువాత ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. బిగ్ బాస్ షో లంటే ముందుగా ఆమెకి ఎక్కువగా సీరియల్స్‌లో నెగెటివ్ రోల్స్ వచ్చేవి. కానీ బిగ్ బాస్ షో తరువాత ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా 'అ ఆ' సినిమా హరితేజ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది.

ఈ సినిమాతో కమెడియన్‌గా మారిపోయింది హరితేజ. తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ హరితేజ నవ్వులు పూయిస్తుంటుంది. అలా హరితేజకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హరితేజ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. డెలివెరీ సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి.

ఇక తనకు పుట్టిన పాపను ఇప్పటివరకు క్లియర్‌గా బ‌య‌ట‌కు చూపించలేదు హరితేజ. మొహాన్ని చూపించకుండా హరితేజ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా హరితేజ తన కూతురికి అదిరిపోయే పేరు పెట్టింది. 'భూమి దీపక్ రావ్' అంటూ పెట్టిన పేరుకి వివరణ కూడా ఇచ్చారు. ''భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు.. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే'' అని తన బిడ్డ చెబుతున్నట్టుగా హరితేజ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.