English | Telugu

ర‌వి చేసిన‌ రొయ్య‌ల ఇగురు.. నోరూరిస్తోంది!

బుల్లితెరపై యాంకర్ రవి ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కో యాంకర్ గా ఎవరు వచ్చినా కూడా రవిలో ఎనర్జీ ఎంతమాత్రం తగ్గదు. లాస్య, శ్రీముఖి, భానుశ్రీ ఇలా ఎంతమంది పక్కన యాంకర్ గా చేసినప్పటికీ తనదైన ముద్ర వేయగలిగాడు. రవి తన ఫ్యామిలీని పరిచయం చేసినప్పటి నుండి ఆయన ఇమేజ్ మారిపోయింది. తన భార్య నిత్య, కూతురు వియాలతో సోషల్ మీడియాలో రవి చేసే అల్లరి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా కూతురు వియాతో రవి షేర్ చేసే వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

అయితే తన కూతురుకి ఇష్టమైన వంటకాలను వండిపెట్టడానికి రవి చేసే ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గత రెండు రోజులుగా రవి ఇంట్లో చెఫ్ అవతారమెత్తారు. రంజాన్ స్పెషల్ గా బిరియానీ వండేశారు. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆ బిరియానీను వియా రుచి చూసి బాగుందని చెప్పడం.. దానికి రవి సంతోషపడడం కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేయడంతో వైరల్ అవుతోంది.

ఇక ఆదివారం నాడు రవి మరో స్పెషల్ డిష్ ను వండిపెట్టారు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే పద్దతిని రవి పాటిస్తున్నట్లు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం రొయ్యల ఇగురుని ఎంతో ఇష్టంగా భార్య, పిల్లలకు వండిపెట్టారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ''ఆదివారం ఆడవాళ్లకు సెలవు.. రొయ్యల ఇగురు రవి స్టైల్ లో.. అందరూ ఇంట్లోనే ఉంటూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా'' అంటూ క్యాప్ష‌న్‌ ఇచ్చారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.