English | Telugu

శేఖర్ మాస్టర్ మంచి మ‌న‌సు.. ప‌స్తులుంటున్న డాన్స‌ర్ల కోసం..!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు పెరిగిపోయాయి. గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. లాక్ డౌన్ వలన చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి. దీంతో పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. అయితే ఈ సెకండ్ వేవ్ లో కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎంతోమంది డాన్సర్లు కూడా పని లేక పస్తులు ఉంటున్నారు.

దీంతో అలాంటివారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. గ్రూప్ డాన్సర్ లు, టీవీ షోలు చేసే డాన్సర్లకు ఈ సమయంలో పని దొరకడం చాలా కష్టంగా మారిందని చెప్పిన ఆయన.. తినడానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పమని తెలుపుతూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్.

ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డాన్సర్లు సహా చాలా మందికి ఆదాయం లేదని.. హైదరాబాద్ లో ఉన్న డాన్సర్లకు ఎవరికైనా నిత్యావసర సరుకులు అవసరమైతే తాను అందిస్తానని శేఖర్ మాస్టర్ అన్నారు. ఈ మేరకు 9989189885, 9618961492, 7416519257 నెంబర్లకి ఫోన్‌ చేసి ఉచితంగా నిత్యావసర సరకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితుల కారణంగా అందరూ ఇంట్లోనే ఉండాలని.. అవసరం ఉంటేనే తప్ప బయటకి రావొద్దని సూచించారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.