English | Telugu

మేం కొట్టుకుంటాం.. తిట్టుకుంటాం!!

బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై కూడా అలరిస్తూ వ‌స్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. తన ప్రేమ, పెళ్లి వంటి విషయాలను ఎప్పటికప్పుడు మీడియాతో చెబుతూనే ఉంటుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నానని.. తన లవ్ స్టోరీతో సినిమా చేయొచ్చని చాలాసార్లు చెప్పింది. తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి తరచూ మాట్లాడుతూనే ఉంటుంది. తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

రీసెంట్ గా ఈ జంట పదకొండో పెళ్లిరోజు సందర్భంగా తమ ప్రేమకు ఇరవై ఏళ్లు నిండాయని చెబుతూ అనసూయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో తన భర్తతో ఇంట్లో ఎలా ఉంటాననే విషయాలు చెప్పుకొచ్చింది. ఎన్‌సీసీ క్యాంపులో తమ ప్రేమ మొదలైందని.. ఆయన ప్రపోజల్ బాగా నచ్చిందని.. ప్రేమ గురించి మాట్లాడకుండా నేరుగా పెళ్లి విషయాన్నే ప్రస్తావించారని అనసూయ చెబుతుంటుంది.

అయితే ఇప్పుడు తన భర్తపై కొన్ని కంప్లైంట్స్ చేస్తోంది. ఇద్దరం ఒకరినొకరం బాగా కొట్టుకుంటామని.. గొడవలు పడుతుంటామని.. ఒకరి మీద ఒకరికి చిరాకు వచ్చేలా చేస్తుంటామని.. ఒక్కోసారి ఇద్దరి అభిప్రాయాలు అసలు క‌ల‌వ‌వ‌ని.. పిచ్చి పనులు చేస్తుంటామని చెప్పింది. ఇక రేపు అనేది లేదనేట్లుగా కొట్టుకుంటామని.. మళ్లీ వెంటనే ఒకరి చేతిని ఒకరం పట్టుకొని అన్నీ మర్చిపోతామని.. అదే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.