English | Telugu

కౌశ‌ల్ భార్య‌కు కొవిడ్ నెగ‌టివ్‌! ఇండియాకు తిరిగొచ్చేసింది!!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు నటుడు కౌశల్. అప్పటివరకు సీరియల్స్ లో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన కౌశల్ కి బిగ్ బాస్ షో ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. షో నుండి బయటకి వచ్చిన తరువాత కొన్ని కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచాడు కౌశల్. అదే సమయంలో కౌశల్ భార్యపై కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల కౌశల్ తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ స్వయంగా ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది. ఉద్యోగ రీత్యా యూకేలో ఉంటున్నానని.. ఆ సమయంలో కోవిడ్ బారిన పడినట్లు నీలిమ వెల్లడించింది. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. తనకు సరైన వైద్యం కూడా చేయడం లేదంటూ వాపోయింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకున్నారు.

తాజాగా నీలిమ కరోనా నుండి బయటపడింది. కోవిడ్ వచ్చిన 8వ రోజే తనకు నెగెటివ్ రావడంతో వెంటనే ఇండియాకు చేరుకుంది. ఈ విషయాన్ని కౌశల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ నుండి తనకు సర్టిఫికేట్ రావడంతో నీలిమ ఇండియాకు చేరుకుందని కౌశల్ తెలిపాడు. తన ఆరోగ్యం గురించి ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికి నీలిమ కృతజ్ఞతలు చెప్పింది. చాలా రోజుల త‌ర్వాత త‌న పిల్ల‌ల‌ను క‌లుసుకున్నానంటూ వాళ్ల‌తో క‌లిసి ఆడుతున్న వీడియోల‌ను షేర్ చేసింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.