English | Telugu

ఆ సీరియ‌ల్‌కు రాశి రెమ్యూనరేషన్ ఇదే!

ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన తెలుగ‌మ్మాయి రాశి.. ఒకానొక దశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోల‌తో వెండితెరపై రొమాన్స్ చేసిన రాశి 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అగ్ర దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారంటే ఆమె పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.

'నిజం' సినిమాలో ఆమె నెగ‌టివ్ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురయ్యాయి. ఆ పాత్ర పోషించినందుకు రాశి ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటుంది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన రాశి.. మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్ లో హీరో త‌ల్లి జ్ఞానాంబగా అలరిస్తోంది.

ప్రస్తుతం ఈ సీరియల్ కు మంచి రేటింగులే వస్తున్నాయి. రాశి పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రాశికి అభిమానూలు బ్రహ్మరథం పడుతున్నారు. తన నటనతో అలరిస్తున్న రాశి ఈ సీరియల్ కోసం మంచి రెమ్యూనరేషనే తీసుకుంటోంది. ఆమెకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇటీవల ఆర్థిక‌ ఇబ్బందుల వలనే రాశి సీరియల్ లో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ ప్ర‌చారాన్ని రాశి ఖండించింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.