Read more!

English | Telugu

నూకరాజుకు సారీ చెప్పిన ఇంద్రజ..




జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో స్టార్టింగ్ అంతా చాలా బాగుంది. ఇక చివరికి వచ్చేసరికి ఏమయ్యిందో ఏమో కానీ ఇంద్రజ నూకరాజుకు సారీ చెప్పాల్సి వచ్చింది. నూకరాజు అండ్ టీమ్ కలిసి స్కిట్ ప్లే చేసింది. ఇందులో "పెదవే పలికే" అనే మహేష్ సాంగ్ కి లిప్ సింక్ ఇచ్చాడు నూకరాజు.. "నీకు అమ్మ అంటే ఇష్టమా" అని లేడీ కమెడియన్ అడిగేసరికి "అమ్మంటే పిచ్చి" అని చెప్పాడు నూకరాజు. తర్వాత షోలో నూకరాజు ఒక బిజినెస్ పెట్టాడు. "ఇక్కడ తిట్లు తిట్టబడును" అని బోర్డు పెట్టి కొత్త బిజినెస్ పెట్టాడు. "తిట్టుకు వెయ్యి రూపాయల లెక్కన పెద్ద తిట్లయితే రెండు వేలు, పెద్ద తిట్లయితే మూడు వేలు తీసుకుందాం" అని చెప్పాడు. ఈ మాటలు అన్నాక నూకరాజు ముఖం వాడిపోయింది.

ఫీలయ్యాడు. కనిపించకుండానే కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఏమయ్యిందో తెలీదు కానీ ఇంద్రజ మాత్రం "ఆడియన్స్ కి ఇక్కడ ఒక విషయం చెప్పాలి" అంటూ సీట్ లోంచి లేచి స్టేజి మీదకు వచ్చింది. ఇంద్రజ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ కనిపించాయి. "రాజు నాకు కొడుకు సమానుడు..చనువుతో ఒక రెండు మాటలు అనేశాను ఇప్పుడు అందరి ముందు ఐ యాం సారీ" అని చెప్పింది. దానికి నూకరాజు అభ్యంతరం చెప్తూ అమ్మా వద్దు వద్దు అంటూ ఆమె కాళ్ళ మీద పడ్డాడు. ఇంతకూ అసలు ఏమయ్యిందో అర్ధం కాలేదు. ఐతే రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే గనక అందులో ఇంద్రజ నూకరాజును కుక్క అని సంబోధించింది. అది కూడా కావాలని కాకుండా...ఫ్లోలో అనేసినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంగా సారీ చెప్పిందా  లేదా ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలీదు. మరి ఈ ఎపిసోడ్ చూస్తే కానీ వీళ్ళ మధ్య జరిగింది ఏమిటో తెలుస్తుంది.