English | Telugu

ఆర్జే కాజలా మాజాకానా..ఆస్కార్ అవార్డుకె గేలం వేసింది..


ఆర్జే కాజ‌ల్ అంటే తెలియని వాళ్లుండరు. ఆర్జేగా రేడియోలో గ‌ల గ‌ల మాట్లాడుతూ శ్రోత‌ల‌ను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. అంతే కాదు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంక‌ర్ గా షోస్ చేస్తూ ఉంది. అలాగే బిగ్ బాస్ సీజ‌న్ - 5కి వెళ్లి ఫేమ‌స్ అయ్యింది. ఎన్నో సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పింది. అలాగే ఎక్స్పోజ్డ్ అనే వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించింది. అలాంటి కాజల్ బుల్లితెర మీద ఎన్నో షోస్ కి వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. రీసెంట్ గా సుమ అడ్డా షోకి కూడా వచ్చింది. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. రాగానే అందరికీ పులిహోర ఇచ్చింది సుమా. ఇక ఈ షోకి మహేష్ విట్టా, శ్వేతా వర్మ, నటరాజ్ మాష్టర్, ఆర్జే కాజల్ వచ్చారు.

వీళ్లందరినీ ఒక ప్రశ్న కూడా అడిగింది. "ఒకవేళ శివుడు ప్రత్యక్షమయ్యి ఏదైనా వరం కోరుకోమంటే మీరేం కోరుకుంటారు" అని అడిగింది. "ఒక వీక్ వరకు నేను ఎవరికీ కనబడకూడదు" అని నటరాజ్ మాష్టర్ చెప్పేసరికి "దానికి దేవుడు ఎందుకు సెల్ పట్టుకుని కూర్చుంటే మీరు ఎవరికీ కనపడరు" అంటూ కాజల్, సుమ చెప్పారు. తర్వాత కాజల్ తన కోరిక చెప్పింది.."అంటే ఇప్పుడిప్పుడే యాక్టింగ్ లోకి అరంగేట్రం చేసాను కాబట్టి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటాను" అని చెప్పింది. దానికి సుమ "చూసారా రాజమౌళి గారు..మీరు ఒక జనరేషన్ ని ఎలా పాడు చేసారో..మీకు అర్ధమవుతోందా ఇదంతా మీరు చేసిందే అని" అంటూ రాజమౌళి మీద సెటైర్స్ వేసింది సుమ . అంటే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీస్లోని "నాటు నాటు" సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక సుమ కూడా ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ చెప్పింది. ఇక మహేష్ విట్టా ఐతే "దేవుడు నాకు డే అండ్ నైట్ షూట్స్ వచ్చేలా చేయాలి..కళ్ళు తిరిగి కింద పడిపోయేలా చేతినిండా షూట్స్ ఉండాలి" అన్నాడు. "మంచి కొరికే కానీ కళ్ళు తిరిగి పడిపోవాలి అన్న లైన్ మాత్రమే దేవుడు వింటే ప్రాబ్లమ్ అవుతుంది" అని సెటైర్ వేసింది సుమ. ఇక శ్వేతా వర్మ ఐతే తన ఫాదర్ తో కలిసి వరల్డ్ టూర్ కి వెళ్ళాలి అని కోరుకుంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.