English | Telugu

సంద‌డిగా పల్లవి సీమంతం వేడుక!


'పాపే మా జీవన జ్యోతి' సీరియల్ తో పల్లవి రామిశెట్టి ఫేమస్ అయ్యింది. ‘రంగుల కల’ అనే షో ద్వారా బుల్లితెర పైకి అడుగుపెట్టింది పల్లవి. ఈ షో సక్సెస్ అయ్యేసరికి మరిన్ని ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. 'భార్యామణి', 'ఆడదే ఆధారం' సీరియల్స్ తో పల్లవి మరింతగా పాపులర్ అయ్యింది. 'భార్యామణి' సీరియల్ లో ఉత్తమ నటనకు గాను నంది అవార్డును కూడా గెలుచుకుంది పల్లవి. తర్వాత ‘మాటే మంత్రం’సీరియల్ లో వసుంధరగా తెలుగు ఆడియన్స్ ని అలరించింది. ప్రస్తుతం 'అత్తారింటికి దారేది', 'పాపే మా జీవన జ్యోతి' సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఈమె సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. అందుకే పల్లవికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ కూడా పెద్దగా తెలియవు. ఐతే ఇటీవల తన సీమంతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన వాళ్లంతా ఈ హడావుడిని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి పల్లవి గురించి తెలిసింది. ఇక బుల్లి తెర నటులు ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి కాబోతున్న పల్లవికి నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. పల్లవి 2019 మే 23న దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.