English | Telugu

రోహిణికి తగ్గ వరుడు దొరికేసాడోచ్..!

బుల్లితెర మీద లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రోహిణి. ఆమె లేని షో లేదు. ఐతే బుల్లితెర మీద పెళ్లి కావలిసిన వాళ్ళల్లో ఆది, సుధీర్, ప్రదీప్, శ్రీముఖి తర్వాత రోహిణి ఉంటుంది. ఇక శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అని చెప్తోంది. ఇప్పుడు రోహిణి తనకు నచ్చిన వరుడు దొరికేసాడు అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఒక క్యూట్ గా ఉన్న అబ్బాయితో కలిసి ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది.

"ఫైనల్లీ నాకు కావాల్సిన వ్యక్తిని కలుసుకున్నా" అంటూ కూడా పెట్టుకుంది. ఈ పోస్ట్ కి ఆరియానా, సమీరా భరద్వాజ్, ప్రియా, సురేఖావాణి, గీతామాధురి, యాట నవీన వంటి వాళ్లంతా రియాక్ట్ అయ్యారు. "అక్క సీరియస్లి ఒక్క క్షణం చూసి నిజమే అనుకుని సంతోషపడ్డా." అని ఆరియానా పెట్టిన కామెంట్ కి "నిజం ఐతే బాగుణ్ణు" అంటూ రోహిణి రిప్లై ఇచ్చింది.

ఇక సమీరా ఐతే "డిస్క్రిప్షన్ చదవని వాళ్ళు ఎర్రిపప్పలు . పోనిలే ఇలాంటి హ్యాండ్సమ్ హజ్బెండ్ ప్రాప్తిరస్తూ" అంటూ దీవించేసింది. "నీకు ఇంతకంటే మంచి అబ్బాయి దొరుకుతాడు ఇన్ అండ్ అవుట్" అంటూ ప్రియా కామెంట్ చేసింది. "కంగ్రాట్స్ రా..గాడ్ బ్లేస్ యు" అంటూ సురేఖావాణి చెప్పింది. "సరే ఇప్పుడు ఇతని కోసం వెతుకుదాం" అంటూ గీతామాధురి కామెంట్ చేసింది. "తధాస్తు ఇంకేంటి ఇంతకంటే హ్యాండ్సమ్ అండ్ గుడ్ పర్సన్ రావాలి" అంటూ యాట నవీన్ విష్ మెసేజ్ పెట్టింది.

ఇలా ప్రతీ ఒక్కరు రోహిణికి మంచి అబ్బాయి రావాలని కోరుకుంటున్నారు. ఐతే డిస్క్రిప్షన్ చూస్తే మాత్రం అది ఒక ఏఐ జెనెరేటెడ్ పిక్ అన్నమాట. ఇక రోహిణి ఐతే ఇలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ ని చూపించినందుకు చాట్ జిపిటికి థ్యాంక్స్ కూడా చెప్పుకుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.