English | Telugu

Karthika deepam 2 : కాబోయే పెళ్లి కూతురు  ఆర్డర్.. శివన్నారాయణ వార్నింగ్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -310 లో..... కార్తీక్ రెస్టారెంట్ కి పారిజాతం వెళ్లి జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కోసం ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తుంటారు. వాళ్ళు రాకముందే పారిజాతం వెళ్లి కార్ లో కూర్చుంటుంది. మేనేజర్ కార్తీక్ కి ఆర్డర్ గురించి చెప్తాడు. ఎవరు ఇచ్చారని కార్తీక్ అడుగగా పేపర్ పై శివన్నారాయణ అని రాసి ఉంటుంది. అది చూసి కార్తీక్ ఆశ్చర్యపోతాడు. వచ్చిందెవరని కార్తీక్ అడుగగా పేరు అడగలేదని మేనేజర్ చెప్తాడు. కార్తీక్ ఫోన్ లో పారిజాతం ఫోటో చూపిస్తూ ఈవిడేనా అని అడుగుతాడు. ఆవిడే అని మేనేజర్ చెప్తాడు. నాకు చెప్పకుండా ఎందుకు ఆర్డర్ తీసుకున్నావని మేనేజర్ ని కార్తీక్ అడుగుతాడు.

ఇప్పుడు ఏం చేద్దామని దీప అంటుంది. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే అమౌంట్ డబుల్ ఇవ్వాలి. వెళ్లి మెనూ కనుక్కుందామని దీపని వెంటేసుకొని శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు కార్తీక్. జ్యోత్స్నకి చీరలు సెలక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. పారిజాతం చూసి కంగారు పడుతుంది. సుమిత్ర చూసి రారా లోపలికి అంటుంది. ఇప్పుడు నేను సత్యరాజ్ రెస్టారెంట్ తరుపున వచ్చాను.. మీరు మెనూ చెప్తే వెళ్తానని కార్తీక్ అనగానే సుమిత్ర, దశరథ్ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. మెనూ ఏంటని వాళ్ళు అడుగుతారు. జ్యోత్స్న ఎంగేజ్మెంట్ కి ఫుడ్ ఆర్డర్ చేసింది జ్యోత్స్న అని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న చెప్పింది చేసానని పారిజాతం అంటుంది. అంటే వాళ్ళు ఎంగేజ్ మెంట్ కి ఈరకంగా అయినా వస్తారని ఇలా చేసానని జ్యోత్స్న అనగానే.. బుద్ది లేకుండా మాట్లాడకు వాళ్ళు రావలసింది ఈ ఇంటికి ఆడపడుచుగా కేటరింగ్ గా కాదని జ్యోత్స్నపై సుమిత్ర కోపడుతుంది. కాంచనతో మాట్లాడానని దశరత్ అంటాడు. మాట్లాడినప్పుడు అక్కడే ఉన్నాను కానీ మీరు కుటుంబంతో రండీ అని పిలవలేదు.. అందుకు మా అమ్మా ఎంత బాధపడిందో మీకేం తెలుసని కార్తీక్ అంటుంటే సుమిత్ర, దశరత్ ఇద్దరు బాధపడుతారు.

ఆధారాలు తీసుకొని వస్తాన్నానవ్ ఏమైందని దీపని సుమిత్ర అడుగుతుంది. అది వదిలేయండి అని దీప అనగానే అంటే లేవనేగా.. నాకు తెలుసు నా కూతురు తప్పు చెయ్యదని సుమిత్ర అంటుంది. దీప నా మాట విని ఆ విషయం వదిలేసింది అని దశరథ్ అనుకుంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఎందుకు వచ్చారని కార్తీక్ ని అడుగుతాడు. కాబోయే పెళ్లి కూతురు మాకు ఆర్డర్ ఇచ్చిందనగానే శివన్నారాయణ షాక్ అవుతాడు. మెను కోసం వచ్చామని కార్తీక్ చెప్తాడు. మెనూ ఫోన్ లో చెప్తాము.. జ్యోత్స్న నువ్వు లోపలికి రా అని శివన్నారాయణ కోపంగా పిలుస్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు బయటకి వస్తుంటారు‌. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం సాధించామని కార్తీక్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.