English | Telugu

నవంబర్ 20 నుంచి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5

ఆహా ఓటిటిలో ఇండియన్ ఐడల్ షో పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్త సీజన్ తో నవంబర్ 20 వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఐతే అది కాస్తా బ్లర్ చేసి వేశారు. ఐతే అందులో ఎవరు ఉన్నారు అనే విషయం లైట్ కనిపిస్తూ ఉంది కానీ అసలు అందులో పార్టిసిపంట్స్ ఎవరన్నది ఇంకా పూర్తిగా తెలీదు. ఐతే మానస్, అఖిల్ సార్ధక, యాదమ్మ రాజు, కావ్యశ్రీ, ప్రేరణ, టేస్టీ తేజ, పంచ్ ప్రసాద్, యాష్మి ఉన్నట్టు కనిపిస్తోంది. ఆహా ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టింది.

ఇక నెటిజన్స్ అంతా కూడా కావ్య - ప్రేరణ కాంబో సూపర్ గా ఉంటుంది, యాష్మి కోసం వెయిటింగ్ ఇక్కడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే హోస్ట్ ఎవరు అన్నది మాత్రం తెలియడం లేదు. అఖిల్ సార్థక్, మానస్ జోడి ఈ ప్రోగ్రాంని హోస్ట్ చేస్తారని నెటిజన్స్ కామెంట్స్ బట్టి తెలుస్తోంది. ఐతే గత సీజన్ చూసుకుంటే సుమ హోస్ట్ చేయగా నటుడు, చెఫ్ ఐన జీవన్ కుమార్ వంటలు టేస్ట్ చూసి మార్క్స్ ఇచ్చారు. ఇక జోడీస్ గా అమర్ దీప్ - అంబటి అర్జున్, యాదమ్మ రాజు - సుప్రీతా, దీపికా రంగరాజు - సమీరా భరద్వాజ్, ప్రష్షు బేబీ - ధరణి, ప్రసాద్ బెహరా - విరాజిత వీళ్లంతా కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా అమర్ దీప్ - అంబటి అర్జున్ జోడి నిలిచింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.