English | Telugu

Brahmamudi : సామంత్ నిజస్వరూపం బయటపడిందిగా.. అనామిక బ్రహ్మాస్త్రం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -623 లో.....ఇంట్లో అందరికి నిజం చెప్పెద్దామని రాజ్ అనగానే.. అప్పుడు ఇంట్లో జరిగే యుద్ధం గురించి రాజ్ కి కావ్య ఉహించి చెప్తుంటే రాజ్ వద్దని భయపడతాడు. మనమే పగలు ఆఫీస్ లో కష్టపడి రాత్రంత ఆ నందగోపాల్ ని వెతికే పనిలో ఉందాం.. అప్పుడు ఆ వంద కోట్లు కట్టే పని ఉండదని కావ్య అమగానే ఒకవేళవాడు దొరకకపోతే అని రాజ్ నెగటివ్ గా మాట్లాడుతుంటే.. కావ్య తనపై విరుచుకుపడుతుంది.

మరొకవైపు రాహుల్, రుద్రాణిలు ధాన్యలక్ష్మిని ని రెచ్చగొట్టే పనిలో పడతారు. ఇదంతా వీళ్ళ ప్లాన్ అయిదు లక్షలు కూడా లేవా ఇదంతా సుభాష్ అన్నయ్య అపర్ణ వదినలు వెనకాల వుండి నడిపిస్తున్నారని రుద్రాణి అనగానే ధాన్యలక్ష్మి ఇంకా రెచ్చిపోతుంది. మరొకవైపు రాజ్ వాళ్లు అప్పులు చేస్తున్నారని సామంత్ అనామిక లు హ్యాపీగా ఫీల్ అవుతారు. దీన్ని ఇంకా పెద్దది చేసి ఎంజాయ్ చేద్దామని అనామిక అనగానే వద్దు ఇప్పుడు ఇంట్లో వాళ్లకి తెలిస్తే అందరు రాజ్ కి సపోర్ట్ గా ఉంటారు. కంపెనీని దక్కించుకుంటారని సామంత్ అనగానే వాళ్లు సంతోషంగా ఉండొద్దు నాకు కంపెనీ ముఖ్యం కాదని అనామిక అనగానే ఇదేంటి ఇలా అంటుంది కంపెనీని సొంతం చేసుకోవాలనే కదా నేను దీంతో చేరిందని సామంత్ అనుకుంటాడు. మరోవైపు రుద్రాణికి అనామిక ఫోన్ చేసి కావ్యని ఇంట్లో నుండి బయటకు పంపే బ్రహ్మాస్త్రాన్ని పంపిస్తున్నానని చెప్పగానే.. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి.. ఏంటీ ఏంటి ఏదో చేస్తున్నట్టున్నారని స్వప్న అంటుంది.

ఆ తర్వాత కావ్యకి ఇందిరాదేవి నగలు ఇవ్వగా.. వద్దు ఇప్పుడు కంపెనీలో ఏం ప్రాబ్లమ్ లేదని కావ్య అంటుంది. నాకు ఇప్పుడు రిలీఫ్ గా ఉంది ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నువ్వు ఈ నగలు తీసుకునే దానివి అని ఇందిరాదేవి అంటుంది. నేను భయటపడలేదని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి అప్పు వచ్చి సర్ ప్రైజ్ ఇస్తుంది. మరొకవైపు అపర్ణకి కావ్య కాఫీ ఇస్తుంది కానీ తను తీసుకోదు. తరువాయి భాగంలో మీకు ధైర్యం ఉంటే అత్తయ్య చేత కాఫీ తాగించండి అని కావ్య అనగానే రాజ్ కాఫీ తీసుకొని అపర్ణ దగ్గరికి వెళ్తాడు. గదిలో నుండీ కాఫీ విసిరేసిన సౌండ్ ఇంకా చెంపదెబ్బ సౌండ్ కావ్య, ఇందిరాదేవిలకి వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.