English | Telugu

Brahmamudi : పంతం వదలని భర్త.. కన్నతల్లి కోసం భార్యని వదిలేసాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -514 లో.....మా అమ్మ అలా అవ్వడానికి కారణమైన వాళ్ళని వెనకేసుకొని వచ్చి రక్తసంబంధాన్ని పట్టించుకోవడం లేదని ఆ మనిషికి సపోర్ట్ చేస్తూ.. నన్ను తప్పు పడుతున్నవ్ అన్నదమ్ముల అనుబంధం తెంపుకునేలా మాట్లాడుతున్నావ్.. అవన్నీ వదిలేసి ప్రశాంతంగా వెళ్ళమని‌ కళ్యాణ్ తో రాజ్ అనగానే.. అలా వెళ్ళాలంటే నువ్వు వదినని తీసుకొని రావాలని కళ్యాణ్ అంటాడు. ఆ పని ఎప్పటికి చెయ్యను. తను తప్పు చేసానని ఫీల్ అయింది కాబట్టి వెళ్లిపోయింది. తప్పు చేయకుంటే గట్టిగా నిలబడి అడిగేదని రాజ్ అంటాడు.

వదిన తప్పు చేసిందని వెళ్ళలేదు నువు భర్తగా తనని అర్థం చేసుకోలేదు కాబట్టి వెళ్ళిపోయింది నమ్మాల్సిన విధంగా నమ్మలేదు కాబట్టి వదిలి వెళ్లిపోయింది. నేను తప్పు చెయ్యలేదు తీసుకొని వచ్చే పరిస్థితి లేదని రాజ్ అనగానే.. ఇంత బండారయిగా ఎలా మారావ్.. నువ్వు తప్పు చేసావని అనుకున్న రోజు సరిచేసే అవకాశం ఉండకపోవచ్చని చెప్పేసి కళ్యాణ్ వెళ్తుండగా.. ధాన్యలక్ష్మి ఆపి.. పరాయి ఇంటి నుండి వచ్చిన మీ వదినని అర్థం చేసుకున్నావ్.. ఈ తల్లిని ఎందుకు అర్థం చేసుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. వదిన వెళ్లిపోవడంలో నీ పాత్ర ఎంత అని కళ్యాణ్ అని వెళ్ళిపోతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఇప్పటివరకు కళ్యాణ్ మాట్లాడితే ఎవరు ఎందుకు సమాధానం చెప్పలేదు. ఇన్ని రోజులు కావ్యని అర్ధం చేసుకున్నావ్.. అనుకున్నాను కానీ నా చెల్లిని వదిలేసేంత అర్థం చేసుకున్నావ్ అనుకోలేదని స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య వెళ్ళిపోయినందుకు రాహుల్ రుద్రాణి ఇద్దరు సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వస్తుంది.

ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు.. కొంపదీసి దీని అంతటికి కారణం మీరేనా అని స్వప్న అడుగుతుంది. మేం కాదని ఇద్దరు డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత కనకం ఇందిరదేవికి ఫోన్ చేసి.. అసలేం జరిగిందని అడుగుతుంది. నా మనవడిదే తప్పని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడుతుంటే అప్పు దైర్యం చెప్తుంది. కాసేపటికి ఇందిరాదేవి రాజ్ దగ్గరికి వచ్చి కావ్యని ఇంటికి తీసుకొని రా అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.