English | Telugu

ఏ చోట నువ్వున్నా.. చివరి 20 నిమిషాలు ఎవరి ఊహలకు అందదు!

మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావు సంయుక్తంగా ఎమ్. ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పసలపూడి ఎస్.వి దర్శకత్వంలో లో నిర్మించిన చిత్రం 'ఏ చోట నువ్వున్నా'. ప్రశాంత్, అంబికా ముల్తానీ హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం రేపు (నవంబర్ 17న) ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా విశేషాలను పంచుకున్నారు.

- మాది ఒకరిది గుంటూరు జిల్లా బోదిలవీడు గ్రామం. ఇంకొకరిది ప్రకాశం జిల్లా పుల్లలచెరువు గ్రామం. చిన్ననాటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. ప్రస్తుతం వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగులం. సినిమా నిర్మించాలి అని ఆలోచన ఎలా వచ్చింది అంటే కరోనా టైమ్ లో ఓటీటీలో కొన్ని మంచి చిత్రాలు చూసినప్పుడు మనం కూడా ఓటీటీకి మంచి కథ తో కూడిన చిత్రాన్ని నిర్మించాలి అనే ఆలోచన పుట్టింది. ఈ విషయాన్ని సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న మా స్నేహితుడు శ్రీ చౌదరితో చెప్పడం, తన ద్వారా దర్శకుడు పసలపూడి ఎస్. వి పరిచయం అవ్వడంతో ఈ చిత్రానికి నాంది పడింది.

- దర్శకుడు పసలపూడి ఎస్.వి కథ చెప్పినపుడు చాలా మంచి కథ అనిపించింది. వెంటనే సినిమా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు కోసం రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించి అందరూ కొత్తవాళ్ళని సెలక్షన్ చేసుకున్నాం.

- ఈ చిత్రం హీరో హీరోయిన్ ప్రశాంత్ అంబికా ముల్తానీల నటన చాలా సహజంగా పల్లెటూరిలో మన పక్కింట్లో వాళ్ళని చూసినట్టు ఉంటుంది. మిగిలిన నటీనటులు అందరూ కథకు న్యాయం చేశారు.

- ఈ చిత్రానికి తరుణ్ రాణా ప్రతాప్ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. చిత్రంలో రెండు పాటలు ప్రేక్షకుల మన్ననలు పొందుతాయి. మా చిత్రానికి డీఓపీగా చేసిన శ్రీకాంత్ మార్క, అనిల్ పీజీ రాజ్ పల్లెటూరు అందాలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఎడిటర్ శ్రీవర్కల కూర్పు చాలా బాగుంది. మా చిత్రానికి కథ - మాటలు కుమార్ పిచ్చుక అందించారు. కథతోపాటు మాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

- పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. దర్శకుడు ఎస్.వి చిత్రం ముగింపుని చాలా కొత్తగా చిత్రీకరించారు. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుంతుందనే నమ్మకంతో ఉన్నాం. నిర్మాతలుగా మాకు మంచి శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వైజాగ్ శంకర్ గారి సారధ్యంలో ఈ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. సినిమా మేకింగ్ అంటే మాకు చాలా ప్యాషన్. ఈ రంగంలో కలిసే కొనసాగుతాం. కచ్చితంగా మంచి మేకర్స్ గా పేరు సంపాదించుకుంటాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.