English | Telugu

త‌గ్గేదేలే అంటున్న య‌ష్‌.. ఆ సినిమా కోసం రూ.150 కోట్లు డిమాండ్!

KGF 1, KGF 2 చిత్రాల‌తో పాన్ ఇండియా హీరోగా మారారు రాకింగ్ స్టార్ య‌ష్‌. ఈ రెండింటిలోనూ KGF 2 ఏకంగా 1200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో య‌ష్ రేంజ్ ఆకాశాన్నంటింది. దీంతో ఆయ‌న నెక్ట్స్ మూవీ ఏదోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదిన్న‌ర‌గా య‌ష్ ఖాళీగా ఉంటున్నారు కానీ.. కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయ‌నేలేదు. ఇది ఆయ‌న అభిమానులను క‌ల‌వ‌పెడుతుంది. రీసెంట్‌గా ఓ లేడీ డైరెక్ట‌ర్‌తో క‌లిసి మరోసారి మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ చేయ‌బోతున్నారంటూ కూడా వార్త‌లు వినిపించాయి. కానీ దీంతో పాటు ఇప్పుడు మ‌రో న్యూస్ కూడా నెట్టింట వైర‌ల్ అవుతుంది.

అదేంటంటే పౌరాణిక చిత్రం రామాయ‌ణం. నితీష్ తివారి తెర‌కెక్కించ‌బోతున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌భీర్ క‌పూర్ న‌టిస్తారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అలాగే సీత పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి కనిపించ‌నుంద‌ని స‌మాచారం. ఇందులో రావ‌ణాసురుడుగా య‌ష్ న‌టించ‌బోతున్నారంటూ చాలా రోజులుగా న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. రీసెంట్‌గానే య‌ష్ ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్‌లోనూ పాల్గొన్నార‌ట‌. అయితే రావ‌ణాసురుడిగా న‌టించ‌టానికి ఆయ‌న అభిమానులు అంగీక‌రించ‌రు. కానీ య‌ష్ మాత్రం న‌టించ‌టానికి భారీ రెమ్యూన‌రేష‌న్‌ను డిమాండ్ చేశార‌ట‌. అంత ఇంతా కాదు.. ఏకంగా 150 కోట్ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం.

భారీ బ‌డ్జెట్ చిత్రం, అందులోనూ రామాయ‌ణం కావ‌టం, పెరిగిన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మేక‌ర్స్ సైతం య‌ష్ అడిగినంత ఇవ్వ‌టానికి రెడీ అయినట్లు న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇప్ప‌టికే త‌మిళంలో ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ వంటి వారితో పాటు తెలుగులో ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్స్ రెమ్యూనరేష‌న్స్ ప‌రంగా వంద కోట్ల మార్క్‌ను ఎప్పుడో దాటేశారు. ఇప్పుడు వారి స‌ర‌స‌న య‌ష్ కూడా జాయిన్ అయ్యారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.