English | Telugu

మెగా బ్ర‌ద‌ర్స్ క‌లుస్తున్నారా?

క‌ల‌సి ఉంటే క‌ల‌దు సుఖం.. అనే నిజం మెగా బ్ర‌ద‌ర్స్‌కు తెలిసొస్తోందా? త్వ‌ర‌లోగా అన్న‌ద‌మ్ముళ్లంతా ఏకం కాబోతున్నారా? ప్ర‌స్తుతం మెగా స‌మీక‌ర‌ణాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. చిరంజీవి - ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల మ‌ధ్య ఓ అడ్డుతెర ఉంద‌ని, ఇద్ద‌రూ దాన్ని ఛేదించే ప్ర‌య‌త్నం చేయ‌ట్లేద‌ని,ఆ అడ్డు తెర క్ర‌మ‌క్ర‌మంగా గోడ‌గా మారింద‌ని మెగా ఫ్యాన్స్‌కు తెలుసు. ఇది వ‌ర‌కు చిరంజీవి ఫ్యాన్స్‌గా ఉన్న‌వాళ్లు ఇప్పుడు చిరు ఫ్యాన్స్‌గా, ప‌వ‌న్ ఫ్యాన్స్‌గా విడిపోవ‌డానికి కార‌ణం అదే. చిరంజీవిని, ప‌వ‌న్ క‌ల్యాణ్‌నీ ఒకే వేదిక‌పై చూసి చాలా కాలం అయ్యింది. `అన్న‌య్య నా గుండెల్లో ఉన్నాడు` అని ప‌వ‌న్ చెప్పినా - `మేమంతా ఒక్క‌టే` అని చిరంజీవి వ‌ల్లించినా - జ‌నానికి రుజువులు కావాలి. ఆ మాట‌ల్ని నిల‌బెట్టుకోవాలి. కానీ అటు చిరు, ఇటు ప‌వ‌న్ ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు. ఇప్పుడా త‌రుణం వ‌చ్చింది. అన్నాద‌మ్ముల్ని క‌ల‌ప‌డానికి మ‌రో మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముందుకొచ్చాడ‌ని టాలీవుడ్ టాక్‌. చిరంజీవి - ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశారాయ‌న‌. వీళ్లిద్ద‌రినీ క‌లుపుతాన‌ని మెగా ఫ్యాన్స్‌కీ మాటిచ్చేశారు.

ఈమ‌ధ్య హైద‌రాబాద్‌లోమెగా ఫ్యాన్స్ మీటింగ్ జ‌రిగింది. తెలుగు రాష్ట్ర్రాల్లో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌మీద మెగా ఫ్యాన్స్‌కీ నాగ‌బాబుకీ మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. చిరంజీవి ఫ్యాన్స్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ అని విడిపోవ‌డం వ‌ల్ల మిగిలిన అభిమాన సంఘాల మ‌ధ్య చుల‌క‌న అవుతున్నామ‌ని, సినిమా వ‌సూళ్ల‌పై కూడా ఆ ప్ర‌భావం ప‌డుతోంద‌ని, జ‌నాల‌కు త‌ప్పుడు సంకేతాలు అందుతున్నాయ‌ని ఫ్యాన్స్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ గురించి బాగా మాట్లాడితే చిరు ఫ్యాన్స్‌కీ, చిరంజీవిని స్థుతిస్తే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కీ కోపాలు వ‌స్తున్నాయ‌ని ఈ ప‌ద్ధ‌తి మంచిది కాద‌ని నాగ‌బాబు కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే.. అతి త్వ‌ర‌లోనే `మేమంతా ఒక్క‌టే` అని తెలిసేలా... ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తాన‌ని ఆయ‌న మాటిచ్చార‌ట‌. దాంతో ఫ్యాన్స్ కొద్దిగా కుదుట‌ప‌డ్డారు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా మెగా ఫ్యాన్స్‌లానే ఉండాల‌ని నాగ‌బాబు హిత‌వు ప‌లికారు. ఈ ఫ్యాన్స్ మీటింగ్ ఉద్దేశం కూడా అదే. అభిమానుల్ని సంఘ‌టిత ప‌రిచి - వ‌చ్చే సినిమాల వ‌సూళ్లు పెరిగేలా చూసే బాధ్య‌త నాగ‌బాబు తీసుకొన్నారు. అందుకే ఈ మీటింగ్ నిర్వ‌హించారు. మొత్తానికి చిరు, ప‌వ‌న్ ఒక్క‌ట‌వుతున్నార‌న్న సంకేతాలు... ఈ మీటింగ్ ద్వారా అందాయి. మ‌రి ఆ వేడుక ఎప్పుడో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.