English | Telugu

ఎన్టీఆర్ చేయ‌లేనిది బ‌న్నీ చేశాడు!

కొన్ని కొన్ని పాత్ర‌ల‌పై కొంత‌మందికి మోజు. `ఆ పాత్ర ఎలాగైనా చేయాలి` అనుకొంటారు. చివ‌రికి మ‌రో హీరోకి ఆ అవ‌కాశం ద‌క్కుతుంది. గోన‌గ‌న్నారెడ్డి పాత్ర కూడా అంతే! కాక‌తీయుల చరిత్ర‌లో గోన‌గ‌న్నారెడ్డిది ఓ అధ్యాయం. గ‌న్నారెడ్డి వీర‌త్వం గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెబుతారు. అందుకే చాలామంది క‌థానాయ‌కులు ఈ పాత్ర చేయాల‌ని ఉబ‌లాట ప‌డ్డార‌ట‌. మ‌రీ ముఖ్యంగా నంద‌మూరి హీరోలు ఈ పాత్ర పోషించాల‌ని క‌ల‌లుక‌న్నారు. అప్ప‌టి నంద‌మూరి తార‌క‌రామారావు, బాల‌కృష్ణ, ఆఖ‌రికి ఎన్టీఆర్ కూడా గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌ని చేయాల‌నుకొన్నార‌ట‌. అయితే ఆ అవ‌కాశం... అల్లు అర్జున్‌కి ద‌క్కింది. రుద్ర‌మదేవిలో బ‌న్నీ ఈ పాత్ర పోషించాడు. గ‌న్నారెడ్డిగా బ‌న్నీ లుక్స్‌.. అదిరిపోయాయి. రుద్ర‌మ‌దేవిగా అనుష్క‌, గ‌న్నారెడ్డిగా బ‌న్నీలే తన సినిమాని నిల‌బెడ‌తార‌ని గుణ‌శేఖ‌ర్ ఆశ‌లు పెట్టుకొన్నాడు. గ‌న్నారెడ్డి పాత్ర‌లో బ‌న్నీ... పెర్‌ఫార్మెన్స్ అదిరిపోయింద‌ట‌. నంద‌మూరి హీరోలు ప్ర‌య‌త్నించి సాధించ‌లేక‌పోయిన పాత్ర‌లో ఈ మెగా హీరో ఎలా మెప్పిస్తాడో వెయిట్ అండ్ సీ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.