English | Telugu

బాహుబ‌లికి అది సాధ్య‌మేనా??

అంద‌రినోటా.. బాహుబ‌లి మాటే. బాహుబ‌లి ఈ రికార్డుని బ్రేక్ చేసింద‌ట‌, ఆ రికార్డుని బ్రేక్ చేస్తుంద‌ట‌.... అంటూ తెగ మాట్లాడుకొంటున్నారు. ఆడియో రైట్స్, ఆడియో ఫంక్ష‌న్ ప్ర‌సార హ‌క్కులు భారీ రేట్ల‌కు అమ్ముడుపోయాయి. అన్ని ఏరియాల నుంచీ ఫ్యాన్సీ రేట్ల‌కు ఈ సినిమాని కొన‌డానికి బ‌య్య‌ర్లు ముందుకొస్తున్నారు. ఈ సినిమా ఎంత వ‌సూలు చేస్తుంద‌న్న విష‌యంపై పందేలు కూడా మొద‌లైపోయాయి. రూ.100 కోట్ల నుంచి 130 కొట్ల‌లోపు బాహుబ‌లి వ‌సూలు చేయొచ్చ‌ని ప్ర‌భాస్ అభిమానులు లెక్క‌లు వేస్తున్నారు. అదే నిజ‌మైతే.. ద‌క్షిణాది రికార్డుల‌న్నీ బాహుబ‌లి బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్టే. దానికి తోడు.. ఇప్పుడు బాహుబ‌లి టీమ్ ఓ స‌రికొత్త ప‌థకం ర‌చిస్తోంది. బాహుబ‌లి విడుద‌లైన తొలి మూడు రోజులూ... టికెట్ల రేట్లు పెంచుకొనే సౌల‌భ్యం కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్పుడైతే రూ.75 , రూ.40 రూ.20 రేట్లు న‌డుస్తున్నాయి. మ‌ల్టీప్లెక్స్‌లో రూ.150 ఫిక్స్‌డ్ రేటు. మ‌ల్టీప్లెక్స్‌వ‌దిలేసి సింగిల్ థియేట‌ర్ల‌లో టికెట్టు రేటు మినిమం రూ.100 చేస్తే.. వ‌సూళ్లు కుమ్మేసుకోవ‌చ్చ‌న్న‌ది రాజ‌మౌళి అండ్ టీమ్ ప్లాన్‌. తొలి మూడు రోజులూ ఏ టికెట్ట‌యినా రూ.100 అంటే.. వారాంతంలోనే రికార్డు స్థాయి వ‌సూళ్లు రాబ‌ట్టుకోవ‌చ్చు. దాంతో గ‌ళ్లాపెట్టెలు నింపేసుకోవ‌చ్చ‌న్న‌ది ప్లాన్‌. అయితే... టికెట్లు రేటు పెంచుకోవాలంటే ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకోవాలి. ఇప్పుడు బాహుబ‌లి రేటు పెంచేతే.. రేపొద్దిట ఇలానే పెద్ద సినిమాల‌న్నీ టికెట్టు రేటు పెంచుకోవడానికి ప్ర‌య‌త్నిస్తాయి. ఇప్ప‌టికే.. జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. సినిమా ఎంత బాగున్నా టాక్ క‌నుక్కొని థియేట‌ర్లో అడుగుపెడుతున్నారు. అలాంటిది రేట్లు పెంచేస్తే.. ఎలా..? అన్న‌ది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌. అయితే రికార్డుల‌ను కొల్ల‌గొట్ట‌డ‌మే ధ్యేయం పెట్టుకొన్న బాహుబ‌లి టీమ్ మాత్రం టికెట్టు రేటు పెంచడానికి తీసుకోవాల్సిన అనుమ‌తుల విష‌యంలో దృష్టిసారించింది. మ‌రి అది బాహుబ‌లికి సాధ్య‌మా, కాదా అన్న‌ది కాల‌మే తేల్చి చెప్పాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.