English | Telugu

ఉత్కంఠ రేపుతున్న పవన్ నిర్ణయం

పవన్ కళ్యాణ్ త్వరలోనే పోలిటిక్స్ లోకి రాబోతున్నాడు అంటూ గతకొద్ది నెలలుగా వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అదే విధంగా ఇటీవలే వరుణ్ తేజ సినిమా ముహూర్త కార్యక్రమాల్లో చిరంజీవి, పవన్ లు ఇద్దరు మాట్లాడుకోకపోవడం వల్ల ఇద్దరికీ విభేదాలు వచ్చాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలకు ఎప్పుడు స్పందించని పవన్ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. చిరంజీవితో ఎలాంటి విభేదాలు లేవని, ఇక మిగిలిన వాటన్నింటికి మరో వారంలో క్లారీటీ ఇస్తానంటూ తెలిపాడు. మరి ఈ ఉత్కంట తగ్గాలంటే మరో వారం వరకు ఎదురుచూడాల్సిందే.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.