English | Telugu

చిరంజీవి కూతురికి దక్కనిది.. నిహారికకు దక్కుతుందా?

మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలుసు. ఆమె తన కెరీర్‌ను యాంకర్‌గా స్టార్ట్‌ చేసింది. అంతకుముందు యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేసి నిర్మాతగా కూడా మారింది. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఐదు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. దాంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకుంది. కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఓటీటీలో ఓ వెబ్‌ సిరీస్‌లు కూడా చేసింది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ’, ‘హలో వరల్డ్‌’, ‘డెడ్‌ ఫిక్సల్స్‌’ వంటి వెబ్‌ సిరీస్‌ చేసి సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. తన ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ను లో బడ్జెట్‌తో కొత్తవారితో చెయ్యాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి కూతురు సుస్మిత ఇప్పటికే నిర్మాతగా రెండు సినిమాలు చేసింది. అయితే అవి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు నిహారిక కూడా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందు ట్రై చేస్తోంది. యుట్యూబ్‌లో ఇన్‌ ఫ్ల్యూయెన్సర్స్‌గా ఉన్నవారు నిహారిక సినిమాలో ఆర్టిస్ట్స్‌గా బిగ్‌స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తను నిర్మాతగా చేసిన వెబ్‌ సిరీస్‌లలో కీలక పాత్రల్లో కనిపించిన నిహారిక ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా నటించే అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మెగా ఫ్యామిలీలో సుస్మితకి నిర్మాతగా సక్సెస్‌ అందుకోలేకపోయింది. ఇప్పుడు నిహారిక తన సినిమాతో సక్సెస్‌ సాధిస్తుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.