Read more!

English | Telugu

ఏపీ ఎన్నికల బరిలో సినీ స్టార్స్.. మీ ఓటు ఎవరికి?

Publish Date:Apr 25, 2024

ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. ఏపీ అసెంబ్లీ బరిలో ముగ్గురు సినీ ప్రముఖులు నిలిచారు. అందులో ఇద్దరు హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా, ఒకరు మాత్రం మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ, ఆర్.కె. రోజా, పవన్ కళ్యాణ్. నందమూరి బాలకృష్ణ: 2014లో హిందూపురం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలకృష్ణ(Nandamuri Balakrishna).. మంచి మెజారిటీతో గెలుపొంది, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వరుసగా రెండోసారి మంచి మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిందూపురం బరిలో నిలిచారు బాలకృష్ణ. ఆయన ఈ 2024 ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. రోజా: ప్రముఖ నటి రోజా(Roja) దాదాపు పాతికేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. 2004 లో నగరి నుంచి, 2009 లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 లో నగరి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొంది, మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో కూడా నగరి నుంచి పోటీ చేసి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి నగరి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే గెలిచిన రోజాకు.. ఈసారి నగరిలో గెలుపు అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ అంచనాలను తలకిందులు చేస్తూ రోజా హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి. పవన్ కళ్యాణ్: 2014 లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. 2019 లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. ఊహించని విధంగా రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన భారీ మెజారిటీతో గెలిచి.. అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు.  

Vijay Deverakonda disastrous Family Star coming to OTT on?

Publish Date:Apr 25, 2024

"Family Star," starring Vijay Deverakonda, is set to premiere on Amazon Prime Video tomorrow. The film, which released on the 5th of this month, has failed to impress audience. The film became disaster on the 2nd day. Vijay Devarakonda and Mrunal have received acclaim for their performances, while the production values of Sri Venkateswara Creations and Parasuram Petla's portrayal of family emotions have been lauded by families. The movie will be available for streaming in Telugu, Tamil, Malayalam, and Kannada languages starting from midnight on Amazon Prime. Produced by star producers Dil Raju and Shirish under the banner of Sri Venkateswara Creations. "Family Star" promises to captivate audiences on the digital platform. As, flop films in theatres getting good talk after the OTT release. Directed by Parasuram Petla, with Vasu Varma is the creative producer.

సిల్క్‌స్మిత చేసిన పనికి చిరంజీవి ఆ పాటను ముగ్గురితో చెయ్యాల్సి వచ్చింది!

Publish Date:Apr 25, 2024

ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారన్న విషయం తెలిసిందే. జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్‌ స్మిత, డిస్కో శాంతి, అనురాధ..లాంటి డాన్సర్స్‌ ఐటమ్‌ సాంగ్స్‌లో నటించి ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేవారు. అప్పట్లో టాప్‌ హీరోలందరి సినిమాల్లో ఇలాంటి ఐటమ్‌ సాంగ్స్‌ ఉండేవి. తర్వాతి కాలంలో ఐటమ్‌ సాంగ్స్‌ను హీరోయిన్స్‌తోనే చేయిస్తూ వాటిని స్పెషల్‌ సాంగ్స్‌గా ఛలామణిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఐటమ్‌ సాంగ్స్‌లో హీరోతోపాటు ఒకరు లేదా ఇద్దరు డాన్సర్స్‌ ఉండేవారు. కానీ, చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘కొండవీటి రాజా’ చిత్రంలోని ‘యాల యాలా.. ఉయ్యాలలోనా..’ అనే ఐటమ్‌ సాంగ్‌ను ఏకంగా ముగ్గురు డాన్సర్స్‌తో చేశారు. అయితే ఇది కావాలని చేసింది కాదు. ఈ ఐటమ్‌సాంగ్‌ను అలా చిత్రీకరించడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే... ఈ ఐటమ్‌ సాంగ్‌ను భారీగా తియ్యాలని కె.రాఘవేంద్రరావు ప్లాన్‌ చేశారు. ఈ సాంగ్‌లో నటించేందుకు సిల్క్‌ స్మితను సెలెక్ట్‌ చేసుకున్నారు. రూ.25 వేలు రెమ్యునరేషన్‌ కూడా ముందుగానే చెల్లించారు. అంతేకాదు, కాస్ట్యూమ్స్‌ కోసం రూ.20వేలు అదనంగా ఇచ్చారు. చెన్నయ్‌లోని వాహిని స్టూడియోలో రూ. 5 లక్షల ఖర్చుతో భారీ సెట్‌ వేశారు. ఆరోజుల్లో సిల్క్‌స్మిత హవా నడుస్తోంది. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది. ఆమెతో సినిమా చెయ్యాలంటే కొన్ని నెలల ముందుగానే కాల్షీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విధంగానే స్మిత కాల్షీట్లు నాలుగు నెలల ముందుగానే తీసుకుంది చిత్ర యూనిట్‌. షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ ప్రారంభించారు.  కాల్షీట్స్‌ ప్రకారం ఆరోజు ఉదయమే సెట్‌కి వచ్చింది స్మిత. ఆమెను చూసి రాఘవేంద్రరావు షాక్‌ అయ్యారు. అప్పుడే నిద్ర లేచి వచ్చినట్టుగా ఉంది. హెయిర్‌ స్టైల్‌ చాలా చిందరవందరగా ఉంది. పాటల చిత్రీకరణ విషయంలో, హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని అందరికీ తెలుసిన విషయమే. అందుకే ఆమె గెటప్‌ ఆయనకు నచ్చలేదు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి హెయిర్‌ స్టైల్‌ మార్చమన్నారు. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్‌ చెబితే టాప్‌ హీరోయిన్‌ అయినా సరే దాన్ని పాటించాల్సిందే. కానీ, స్మిత మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. పైగా హెయిర్‌ స్టైల్‌ బాగానే ఉందంటూ వాదించింది. ఆమెతో డిస్కస్‌ చేయడం ఇష్టంలేని రాఘవేంద్రరావు పాటను తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ ఒక్క విషయంలోనే కాదు, ఆరోజంతా యూనిట్‌లోని వారిని చాలా ఇబ్బంది పెట్టింది స్మిత. పాటలోని కొంత భాగాన్ని పొగమంచులో తియ్యాల్సి ఉంది. షాట్‌కి ముందు పొగమంచును స్ప్రెడ్‌ చేశారు టెక్నీషియన్స్‌. ఆ సమయంలోనే ఫ్యాన్‌ వేసుకొని కూర్చుంది స్మిత. దాంతో పొగమంచు వీడిపోయింది. ఆ కారణంగా షూటింగ్‌ మరింత ఆలస్యమైంది. ఇదంతా నిర్మాత దేవివరప్రసాద్‌ గమనిస్తున్నారు. షూటింగ్‌కి ఇబ్బంది కలుగుతుందని ఏమీ మాట్లాడకుండా ఉన్నారాయన. మరుసటిరోజు కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు. పైగా డైరెక్టర్‌ని కూడా తన మాటలతో అవమానించిందట. దీంతో నిర్మాతకు కోపం ఆగలేదు. రాఘవేంద్రరావుతో మాట్లాడి ఆమెను సినిమా నుంచి తొలగించారు. అప్పటికి స్మితతో రెండు చరణాలు మాత్రమే చిత్రీకరించారు. పల్లవి, మరో చరణం బ్యాలెన్స్‌ ఉన్నాయి. పల్లవిని జయమాలినితో, మరో చరణాన్ని అనురాధతో తీశారు. అందుకే జయమాలిని పాట ప్రారంభంలో వచ్చే చరణంలోనే కనిపిస్తుంది. మిగిలిన చివరి చరణాన్ని కూడా జయమాలినితోనే తీస్తే మధ్యలో వచ్చే రెండు చరణాల్లో స్మిత కనిపిస్తుంది. అది ఎబ్బెట్టుగా ఉంటుందని భావించారు. ఆ చరణాన్ని మరో డాన్సర్‌తో తీస్తే కావాలనే ముగ్గురితో పాట చేశారనే ఫీలింగ్‌ ఉంటుందన్న ఉద్దేశంతో అనురాధతో చేయించారు. ఈ ఐటమ్‌ సాంగ్‌ వెనుక ఇంత తతంగం జరిగిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

కూతురు కోసం మార్పులు చేయించిన  షారుక్ ఖాన్.. గురు శిష్యులు కదా మరి 

Publish Date:Apr 20, 2024

సిల్వర్ స్క్రీన్ మీద వారసత్వం కొత్త విషయమేమి కాదు. హీరో, హీరోయిన్,డైరెక్టర్ ల దగ్గరనుంచి 24 క్రాఫ్ట్స్ కి  చెందిన వారసులు సినీ రంగంలో రాణిస్తు వస్తున్నారు. ఇక హీరోలు  అయితే తమ వారసులతో కలిసి స్క్రీన్  షేర్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ఒక అగ్ర హీరో తన కూతురు తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తుంది.కాకపోతే అందులో చిన్న చేంజ్. దీంతో ఆ న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి ఇండియా వైడ్ గా ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఆయన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో కింగ్ కూడా ఒకటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇందులో ఆయన కుమార్తె  సుహానా ఖాన్ కూడా నటిస్తుంది. పైగా సుహానా ఫస్ట్ మూవీ కావడంతో షారుక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  షారుఖ్ ఒక అతిధి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు గతంలో  వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం సుహానా కి మార్గనిర్దేశం చేసే గురువుగా కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. అందుకోసం స్క్రిప్ట్ లో భారీ మార్పులు   కూడా జరిగాయని  అంటున్నారు. అంటే తండ్రి కూతుళ్లు గురు శిష్యులుగా నటించబోతున్నారు.   ఇప్పుడు ఈ వార్తతో షారుక్ ఫ్యాన్స్ లో జోష్ వచ్చినట్లయ్యింది. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద షారుక్ అండ్ సుహానా కాంబో చూస్తామనే  క్యూరియాసిటీ వాళ్ళల్లో  ఉంది.  సుజయ్ ఘోష్ దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో కింగ్  తెరకెక్కబోతుంది.ఫైట్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.అందుకోసం  విదేశీ స్టంట్ మాస్టర్ లని తీసుకొస్తున్నారు. ఈ ఏడాది అగస్ట్ లో షూటింగ్ ని ప్రారంభించి 2025 లో రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు.   

Salman Khan latest film gets Disastrous Day 1 with Flop Talk?

Publish Date:Apr 22, 2023

After a hiatus of four years, Salman Khan marked his return to the silver screen on Eid with a family entertainer titled Kisi Ka Bhai Kisi Ki Jaan. The film's opening day witnessed some negative response among the masses. However, it failed to create the same buzz among multiplex audiences. Its reviews have not been encouraging either.   The film rakes only 12 Crores on its first day, which falls short of the staggering amounts earned by the actor's previous Eid releases. The collection of its opening day is even lower than Khan’s previous flops like Bharat, Race 3 and Tubelight.   It appears that the audience took the film for granted, just as the makers and Salman Khan did. In the past, Salman Khan has been known to release his films on the occasion of Eid, with 10 of his movies having been released on this auspicious day. The film is likely to become biggest disaster in Salman Khan's career.

సూపర్ ట్విస్ట్ తో ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రోమో!

Publish Date:Apr 25, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ' ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్' ఒకటి. ఈ సీరియల్ కి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈ సీరియల్ ప్రతీ ఎపిసోడ్ ట్విస్ట్ లతో సాగుతోంది. నిన్న మొన్నటిదాకా సిరి, ధనల ఇష్యూ సాగగా.. నేటి ప్రోమోలో అభి ఏకంగా ఇంటికే వస్తాడు. దాంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మాణిక్యం వన్ మ్యాన్ షోగా సీతాకాంత్ ఎత్తులు ఓవైపు.. శ్రీలత తెగింపు మరోవైపు సాగుతుంది. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి డబ్బుల కోసం సీతాకాంత్ ని వాడుకోవడంతో నిన్నటి ఎపిసోడ్ లో సీతాకాంత్, రామలక్ష్మి కలిసి అభి వాళ్ళింటికి రావడంతో.. ఇక అభి దొరికేసాడని అందరు అనుకున్నారు. ముగ్గురు సపరేట్ గా కలిసి మాట్లాడారు. అభి చేసే పనులకి, చెప్పే మాటలకి సంబంధం లేదని తన మీద డౌట్ గా ఉందని సీతాకాంత్ ప్రశ్నిస్తాడు‌. దాంతో రామలక్ష్మితో పాటుగా అభి కూడా షాక్ అవుతాడు. ఇదిలా ఉండగా నేడు రిలీజైన తాజా ప్రోమోలో .. అర్థరాత్రి అందరు పడుకున్నాక రామలక్ష్మికి అభి కాల్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటని రామలక్ష్మి అడుగగా.. నేను మీ ఇంటి ముందే ఉన్నానని రమ్మని చెప్తాడు. దాంతో పరుగున అభి దగ్గరికి వచ్చేస్తుంది రామలక్ష్మి. మనమిద్దరం ఇలా కలవడం కరెక్ట్ కాదు.. ఇంట్లో వాళ్ళు చూస్తే మన నాటకం బయటపడుతుందని రామలక్ష్మి అనగా..  నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా అని అభి అంటాడు. అప్పుడే శ్రీలత మేడ మీద నుండి చూసి.. సందీప్, సీతాకాంత్ అంటు అందరిని పిలుస్తుంది. అందరు కిందకి వచ్చాక.. ఆ అభిగాడు వచ్చాడు.. రామలక్ష్మి, అభి ఆ పొదల వెనుక దాక్కున్నారని అందరితో శ్రీలత చెప్తుంది. మేడ మీద నుండి సీతాకాంత్ చూస్తుంటాడు. మరి అభి, రామలక్ష్మి దొరికిపోతారా లేదా అనే ట్విస్ట్ తో నేటి కథనం ఉండబోతుంది.   

ఊహించని కాంబో.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

Publish Date:Apr 23, 2024

అతికొద్ది కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగాడు. అయితే కొన్నేళ్లుగా విజయ్ కి సరైన విజయాలు దక్కడం లేదు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేసిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'పై ఎన్నో ఆశలు పెట్టుకోగా అది నిరాశపరిచింది. మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. దీంతో ఇంకెవరైనా స్టార్ డైరెక్టర్ తో విజయ్ సినిమా పడితే బాగుంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో విజయ్ సినిమా చేసే అవకాశముందనే వార్త ఆసక్తికరంగా మారింది. 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్(Prabhas) తో 'సలార్' చేశాడు నీల్. త్వరలోనే 'సలార్-2' కూడా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు రామ్ చరణ్(Ram Charan) వంటి స్టార్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ కన్ను.. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండపై పడటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్ళాడు. వీరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రానుందని, దానికి సంబంధించిన చర్చల కోసమే విజయ్ ని నీల్ కలిశాడని న్యూస్ వినిపిస్తోంది. ఓ రకంగా ఇది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. 'సలార్-2'తో పాటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక.. విజయ్ తో నీల్ సినిమా చేస్తాడేమో చూడాలి. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా పడితే మాత్రం.. ఒక్కసారిగా విజయ్ రేంజ్ మారిపోతుంది అనడంలో సందేహం లేదు.

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

ఆడు జీవితం

Publish Date:Mar 28, 2024

Operation Valentine

Publish Date:Mar 1, 2024

KGF Chapter 2

Publish Date:Apr 14, 2022

RRR

Publish Date:Mar 25, 2022

Radhe Shyam

Publish Date:Mar 11, 2022

Clap

Publish Date:Mar 11, 2022