English | Telugu

సూర్య తండ్రిపై విశాల్ కీలక వ్యాఖ్యలు 

స్టార్ హీరో సూర్య(Suriya)మే 1 న 'రెట్రో'(Retro)మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సూర్య తండ్రి ఒకప్పటి హీరో శివకుమార్(Sivakumar)హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తమిళ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ బాడీతో సిల్వర్ స్క్రీన్ పై కనపడిన తొలి హీరో నా కొడుకు సూర్య నే అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన మాటలు తమిళ చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారాయి.


రీసెంట్ గా విశాల్ ఒక ఇంటర్వ్యూలో శివకుమార్(Sivakumar)చేసిన వ్యాక్యలపై మాట్లాడుతు తమిళ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ బాడీని ట్రై చేసింది ధనుష్. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'పొల్లధావన్' లో ఆ విధంగా కనపడ్డాడు. నేను కూడా 'సత్యం' అనే సినిమాతో పాటు 'మదగజరాజ' లోను సిక్స్ ప్యాక్ తో కనిపించాను. బహుశా ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయిఉండవచ్చని చెప్పుకొచ్చాడు. విశాల్ ఈ ఏడాది జనవరిలో 'మదగజరాజ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2012 లో షూటింగ్ ని జరుపుకున్న ఈ మూవీ పన్నెండు ఏళ్ళ తర్వాత రిలీజ్ అయ్యింది. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా చేసారు.



టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.