English | Telugu

అప్పుడే ఓటీటీలోకి 'విరూపాక్ష'!

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకుడు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.47 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతూ పలు చోట్ల మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.

'విరూపాక్ష' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నెల 21 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్.. ఓటీటీలోకి వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ మార్క్ అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. 50 కోట్ల మార్క్ కి దగ్గరవుతున్న వేళ.. ఓటీటీలో అలరించడానికి సిద్ధమవ్వడం విశేషం. మరి ఈ సినిమాకి ఓటీటీలో కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...