English | Telugu

రూ.50 కోట్ల షేర్ దిశగా 'విరూపాక్ష'.. విజయ్, నాని తర్వాత సాయి ధరమ్ తేజ్!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. రెండో వీకెండ్ లోనూ అదిరిపోయే కలెక్షన్స్ తో సత్తా చాటిన ఈ చిత్రం.. పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.38 కోట్ల షేర్ రాబట్టింది. ఈ శుక్రవారం విడుదలైన 'ఏజెంట్'కి ఫ్లాప్ టాక్ రావడం, 'పొన్నియిన్ సెల్వన్-2' డబ్బింగ్ సినిమా కావడంతో.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న 'విరూపాక్'కే తెలుగు ప్రేక్షకులు ఓటేస్తున్నారు. ఈ శని, ఆది వారాల్లో కూడా ఈ చిత్రం రెండు కోట్లకు పైగా షేర్ తో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ గా రెండో శనివారం రూ.2.16 కోట్ల షేర్, రెండో ఆదివారం రూ.2.64 కోట్ల షేర్ రాబట్టింది.

పది రోజుల్లో నైజాంలో రూ.13.29 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.4.42 కోట్లషేర్, ఆంధ్రాలో రూ.12.74 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.30.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2.45 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.4.86 కోట్ల షేర్ కలిపి.. పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 37.76 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఈ సినిమా త్వరలో 40 కోట్ల షేర్ క్లబ్ లో చేరడం ఖాయమే. సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు.. వేసవి సెలవులు కావడం, ఇతర సినిమాల నుంచి చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో 'విరూపాక్ష' బాక్సాఫీస్ జోరు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది. దీనికి తోడు మే 5న హిందీతో పాటు ఇతర భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం నార్త్ లో కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల హవా లేకపోవడంతో.. విరూపాక్ష ఎంతో కొంత సత్తా చూపే అవకాశముంది. అదే జరిగితే ఫుల్ రన్ లో అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిదాకా యంగ్ హీరోల్లో సోలోగా 'గీత గోవిందం'(రూ.70 కోట్లకు పైగా షేర్)తో విజయ్ దేవరకొండ, 'దసరా'(రూ.60 కోట్లకు పైగా షేర్)తో నాని ఈ ఫీట్ సాధించారు. మరి ఇప్పుడు విరూపాక్షతో సాయి ధరమ్ తేజ్ కూడా రూ.50 కోట్ల షేర్ క్లబ్ లో చేరతాడేమో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.