English | Telugu

ఘనంగా కార్తీక్ రాజు ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్

డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లకు ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ అందరికీ తెలిసిందే. అలాంటి ఓ వినూత్నమైన కథాంశంతో ప్రస్తుతం ఓ చిత్రం రూపు దిద్దుకుంటోంది. యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు ‘విలయ తాండవం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్ 1) నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో..

ఆకాష్ పూరి మాట్లాడుతూ ..‘‘విలయ తాండవం’ టైటిల్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. ఈ ఈవెంట్‌కు నన్ను ఆహ్వానించిన టీంకు థాంక్స్. టైటిల్ పోస్టర్‌ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘కార్తీక్ రాజు నేను తీసిన ‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రంలో నటించారు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటారు. సినిమా పట్ల ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. ఈ ‘విలయ తాండవం’తో మరోసారి కార్తీక్ రాజుకి హిట్ రావాలి. టైటిల్ పోస్టర్ అయితే నాకు చాలా నచ్చింది. కంటెంట్ బేస్డ్ చిత్రాల్ని జనాలు ఇప్పుడు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలానే ‘విలయ తాండవం’ మూవీని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ .. ‘ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలనే జనాలు ఆదరిస్తున్నారు. మంచి కాన్సెప్ట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. డైరెక్టర్ వాసు సరికొత్త పాయింట్, కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మూవీలో నేను, పార్వతి, జగదీష్ చాలా ముఖ్యమైన పాత్రల్ని పోషించాం. నిర్మాతలైన ధర్మా రావు, గుంపు భాస్కర రావు నాకు ఫ్యామిలీ మెంబర్లలా మారిపోయారు. ఈ మూవీతో మా అందరికీ పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత మందల ధర్మా రావు మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ వాసు మాకు ఈ కథను చెప్పినప్పుడే ఆశ్చర్యపోయాను. అద్భుతమైన కథతో ‘విలయ తాండవం’ మూవీని నిర్మించాం. ఈ పోస్టర్ చూస్తేనే కథ ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో ఆడియెన్స్ ముందుకు వస్తామ’ని అన్నారు.

నిర్మాత గుంపు భాస్కర రావు మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ వాసు చెప్పిన కథ మాకు చాలా నచ్చింది. కథలో దమ్ముంది అని నాకు అర్థమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మేం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించాం. మాకు మీడియా, ఆడియెన్స్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని కాంక్షిస్తున్నాను’ అని అన్నారు.

దర్శకుడు వీఎస్ వాసు మాట్లాడుతూ .. ‘మా స్నేహితుడు సంజయ్ వల్లే ఈ మూవీ ప్రయాణం మొదలైంది. నాకు అండగా నిలిచి అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకు థాంక్స్. మా కోసం ఈ రోజు ఇక్కడకు వచ్చిన గౌర హరి, ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు గార్లకు థాంక్స్. ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన కార్తీక్ రాజుకి థాంక్స్. త్వరలోనే మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ మాట్లాడుతూ .. ‘కార్తిక్ రాజుతో ఇది వరకు నేను ‘అథర్వ’ మూవీకి పని చేశాను. అప్పటి నుంచి మా జర్నీ కొనసాగుతూనే ఉంది. ‘విలయ తాండవం’ సినిమాకు పని చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ .. ‘‘విలయ తాండవం’ టైటిల్ చాలా బాగుంది. పోస్టర్‌ను చూస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం అవుతుంది. ఈ మూవీలో నాకు మంచి కొరియోగ్రఫీ అందించే అవకాశం వచ్చింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ కపిల్ మాస్టర్ మాట్లాడుతూ .. ‘‘నాకు అవకాశాన్ని ఇచ్చిన ‘విలయ తాండవం’ టీంకు థాంక్స్. అథర్వ, గ్యానీలతో నాకు మంచి పరిచయం ఉంది. ఈ మూవీతో దర్శక, నిర్మాతలకు మంచి పేరు, లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.