English | Telugu

మళ్ళీ వాయిదా పడిన విక్రమసింహ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రజినీకాంత్ "విక్రమసింహ" ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుందని ప్రచారం చేసారు. కానీ ఈ చిత్రాన్ని మళ్ళీ వాయిదా వేసారు. ఈ చిత్రాన్ని మే23 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా 2డి, 3డి లలో తెరకెక్కింది. వీటికి సంబంధించిన ప్రింట్లు ఇంకా సిద్ధం కాకపోవడం వల్లనే చిత్ర విడుదల ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. కానీ ఈ చిత్ర పంపిణీ విషయంలో నిర్మాతలకు, పంపిణీ దారులకు మధ్య సమస్య ఏర్పడిందని సమాచారం. ఏదేమైనా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని కాంత్ సరసన దీపిక పదుకునే, శోభన వంటి తారలు నటించారు. రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.