English | Telugu

యువకుడిగా.. వృద్ధుడిగా!!

తెలుగులో "అపరిచితుడు" పేరుతో అనువాదమైన చిత్రానికంటె ముందే విక్రమ్‌కు తమిళంలో స్టార్‌డమ్ వచ్చింది. "అపరిచితుడు" అనంతరం తెలుగులోనూ మార్కెట్ ఏర్పడి అతగాడు సూపర్‌స్టార్ అయ్యాడు.

అయితే.. ఆ సూపర్‌స్టార్‌డమ్ చాలా కొద్ది కాలం మాత్రమే నిలిచింది. ఎందుకంటె.. "అపరిచితుడు" తర్వాత విక్రమ్ నటించిన సినిమాలన్నీ అసాధారణరీతిలో అపజయం పాలయ్యాయి. ఆ చిత్రాలన్నీ.. "మజా, భీమ, మల్లన్న, విలన్, నాన్న, వీడింతే, శివతాండవం" పేర్లతో డబ్బింగ్ చేయబడి.. తెలుగులోనూ పరాజయం పాలయ్యాయి.


దాంతో మళ్లీ శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రంపై విక్రమ్ విపరీతమైన ఆశలు పెట్టుకొన్నాడు. ఈ చిత్రం తెలుగులో "మనోహరుడు" పేరుతో అనువాదం కానుంది. ఈ చిత్రంలో విక్రమ్ 15 ఏళ్ల ప్రాయంగల యువకుడిగానూ.. 85 ఏళ్ల వయస్సుకల వృద్ధుడిగానూ కనిపించి కనువిందు చేయనున్నాడు. ఈ చిత్రంతోనైనా విక్రమ్‌కు పూర్వ వైభవం ప్రాప్తిస్తుందేమో చూడాలి!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.