English | Telugu

రజనీకాంత్‌కి వార్నింగ్‌ ఇచ్చిన వీరప్పన్‌.. అసలేం జరిగింది?

ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వీరప్పన్‌ గురించి మీడియా పుణ్యమా అని ఇప్పటి తరానికి కూడా బాగా తెలిసింది. అతని జీవిత చరిత్ర సినిమాల రూపంలో వస్తుండడంతో పూర్తి సమాచారం అందరికీ అందుతోంది. తాజాగా వీరప్పన్‌కి సంబంధించిన ఒరిజినల్‌ వీడియోను జీ 5 ఓటీటీలో విడుదల చేశారు. ఇందులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తావన తెచ్చాడు వీరప్పన్‌. డిసెంబర్‌ 12 రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జీ5 మాత్రం ‘కూసే మునిసామి వీరప్పన్‌’ పేరుతో స్ట్రీమింగ్‌ చేయనున్న డాక్యుమెంటరీ నుంచి ఒక ఒరిజినల్‌ వీడియోను ఈ సందర్భంగా ప్రేక్షకులతో పంచుకుంది. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్‌ 14న స్ట్రీమింగ్‌ కానుంది.

ఆ వీడియోలో వీరప్పన్‌ మాట్లాడుతూ ‘రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంజిఆర్‌గారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంజీఆర్‌లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడం సాధ్యమయ్యే పనికాదు. ఎంజీఆర్‌లాగే రజనీకాంత్‌ కూడా అవుతారని నాకు తెలుస్తోంది. ఆయన అందర్నీ గౌరవిస్తారు. దేవుడిని బాగా నమ్ముతారు. కానీ.. ఒక్క విషయం ఆయనకు చెప్పదలుచుకున్నాను. అయ్యా రజనీకాంత్‌... మీరు రాజకీయాల్లోకి రావొద్దు. ఎవరికీ మద్దతు తెలపొద్దు. నిన్ను మింగటానికి ఎన్నో మొసళ్లు వెయిట్‌ చేస్తున్నాయి. అవి ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయచేసి అమాయకుడిలా బలి కావొద్దు’’ అంటూ వీరప్పన్‌ చెప్పిన మాటల ఒరిజినల్‌ వీడియోను విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్‌ శ్రేయస్సును కోరి వీరప్పన్‌ ప్రేమగా హెచ్చరించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. రజనీకాంత్‌ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లో రావాలని సిద్ధపడినప్పటికీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నాని రజనీ విరమించుకున్నారు. కొన్ని సంవత్సరాలపాటు మూడు రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరిగిన వీరప్పన్‌ పట్టుకోవడం ఎవ్వరి వల్లా కాలేదు. చివరికి 2004లో పథకం ప్రకారం చేసిన ఓ ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్‌ మరణించాడు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను ఓ డాక్యుమెంటరీ రూపంలో జీ5 ప్రసారం చేయనుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.