English | Telugu

కోర్టును ఆశ్రయించిన తుఫాన్

రాష్ట్రంలో సమైఖ్య ఉద్యమం వలన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల కావలసిన పెద్ద పెద్ద చిత్రాలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ నటించిన తుఫాన్(జంజీర్ హిందీలో) చిత్రాన్ని సెప్టెంబర్ 06న ఒకేసారి తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయడానికి ఈ చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేసారు.

అయితే తమ సినిమాకు ఈ ఉద్యమ తాకిడి ఉండకుండా రక్షణ కల్పించాలని ఈ చిత్ర నిర్మాతలను కోర్టును ఆశ్రయించారు. థియేటర్ వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా రక్షణ కల్పించాలని, ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని కోర్టు వారిని ఈ చిత్ర నిర్మాతలు ఆశ్రయించారు.

మరి రిలీజుకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.