English | Telugu

మీడియాపై త్రిష ఫైర్‌

పెళ్ల‌య్యాక కూడా సినిమా రంగంలో కొన‌సాగాల‌నుకొంటోంది త్రిష‌. అందుకే న‌ట‌న‌కు దూర‌మ‌వ్వ‌బోవ‌డం లేద‌న్న సంకేతాల్ని ప‌రిశ్ర‌మ‌కు పంపింది. ``పెళ్ల‌య్యాక మీరు న‌టిస్తారా? సినిమాల‌కు దూరంగా ఉంటారా? అని మీడియాలో న‌న్ను చాలామంది అడుగుతున్నారు. అస‌లు ఇలాంటి ప్ర‌శ్న క‌థానాయిక‌కే ఎందుకు ఎదుర‌వుతుందో నాకు అర్థం కాదు. ఈ ప్ర‌శ్న హీరోల‌ను అడ‌గ్గ‌ల‌రా? పెళ్ల‌య్యాక కూడా న‌టించే సౌల‌భ్యం వాళ్ల‌కే ఉందా..?`` అంటూ మండిప‌డుతోంది. ``నేను న‌ట‌న‌ని ఆస్వాదిస్తున్నా. నా కెరీర్ తొలిరోజుల్లో సెట్స్‌లో ఎంత కిక్కు ల‌భించేదో.. ఇప్ప‌టికే అంతే కిక్కు దొరుకుతోంది. ప‌దేళ్ల కాలంలో సినిమాల‌పై ఓ అవ‌గాహ‌న పెంచుకొన్నా. దాంతో పాటు ప్రేమ పెరిగింది. స‌డ‌న్‌గా సినిమాల్ని వ‌ద‌ల్లేను`` అంది. ద‌మ్ము సినిమా ముందు కూడా త్రిష ఇలానే మాట్లాడింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక‌.. తెలుగులో అవ‌కాశాలు రాలేదు. ఇప్పుడు ల‌య‌న్‌తో మ‌ళ్లీ కాస్త ఆత్మ‌విశ్వాసం తెచ్చుకొంది. ఈసినిమా హిట్ట‌యితేనే త్రిష‌కు ఇక్క‌డ ఆఫ‌ర్లు వ‌స్తాయి. లేదంటే.. త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందే. ఆ సంగ‌తి అమ్మ‌డికి అర్థం కావ‌డం లేదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.