English | Telugu

టైగర్ నాగేశ్వరరావు.. హిందీకి ఎక్కువ, తెలుగుకి తక్కువ

మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషించిన పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' నేడు(అక్టోబర్ 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ, సెకండాఫ్ తేలిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ నిడివి కారణంగా సాగదీతగా అనిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందని చెబుతున్నారు.

టైగర్ నాగేశ్వరరావు నిడివి 3 గంటలు అని తెలిసినప్పుడే.. ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే చిత్ర దర్శకుడు వంశీ మాత్రం నిడివి అసలు సమస్య కాదని, సినిమా చూశాక ఇంకో 30 నిమిషాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. కానీ తీరా విడుదలయ్యాక ఆ నిడివే అసలు సమస్య అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదట టైగర్ నాగేశ్వరరావు నిడివిని 181 నిమిషాల 39 సెకన్లుగా ప్రకటించారు. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ తెలుగు వెర్షన్ ని 172 నిమిషాలకు కుదించారు. అయినప్పటికీ తెలుగునాట ల్యాగ్ అనే మాట వినిపిస్తోంది. అయితే హిందీలో మాత్రం 181 నిమిషాల 39 సెకన్ల నిడివితోనే విడుదల చేశారు. పది నిమిషాలు కుదించినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ల్యాగ్ అని అంటున్నారు. అలాంటిది పది నిమిషాల నిడివి ఎక్కువున్న సినిమా చూసి హిందీ ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.