English | Telugu

ది లక్ సామాన్యుడి గేమ్ షో.. పది లక్షల రూపాయల కారు బహుమానం

రియాలిటీ షో లపై ప్రస్తుతం ప్రజలకి ఎంతో మక్కువ కలుగుతున్న విషయం తెలిసిందే. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులని ఆధారంగా ఒక రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల నుండి పలు భాషల్లో రియాలిటీ షోలు ఉండగా అవి అన్ని ఎంతోకొంత సినీ సెలబ్రటీలను, ఇతర రంగాలలో ప్రముఖులని షోలో బాగంగా చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. కాని దేశంలోనే తొలిసారిగా కేవలం సామాన్యులు మాత్రమే తమ గేమ్ లో ఉండేవిధంగా 'ది లక్' అనే రియాలిటీ షో ఉండబోతుంది.

నేడు మీడియా సమక్షంలో ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బృందం "ది లక్" పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ షోను ఒక పెద్ద సెలబ్రిటీ హోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, యూట్యూబ్ & ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా ఆర్ట్స్ బృందం గేమ్ షో కి సంబంధించిన కొన్ని అంశాలను మీడియాతో పంచుకున్నారు.

“ది లక్” ముఖ్యాంశాలు :
స్థైర్యం, వ్యూహం, ఓర్పు ఆధారంగా ఉండే సులభమైన సవాళ్లు.
ప్రత్యేక ప్రతిభ అవసరం లేదు. కేవలం కృషి, దృష్టి, కొంచెం అదృష్టం.
ప్రతి విజేతకు రూ. 10 లక్షల బహుమతి.
విశ్వసనీయ సబ్స్క్రైబర్లలో నుంచి యాదృచ్ఛికంగా ఎంపిక.
జీరో రిజిస్ట్రేషన్ ఫీజు, పూర్తిగా ఉచితంగా పాల్గొనవచ్చు.

నూతనత, వినూత్నతతో యువతను ఆకట్టుకునే కంటెంట్‌ను సృష్టించడంలో పేరుపొందిన ప్రజా ఆర్ట్స్ నిర్మించింది.

ఎందుకు “ది లక్”?
ఇది కొత్త తరహా రియాలిటీ వినోదం – పట్టుదల, సహనం, మరియు అవకాశాలను పరీక్షించే వేదిక.
ఇది కీర్తి గురించి కాదు... నిలబడి, నిలిచిపడి, గెలవడానికి దారిని చూపించే వేదిక.

ఈ షోకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బృందం తెలిపారు. అంతేకాక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన ఒక గిఫ్ట్ ఉంటుందని తెలిపారు.

నిర్మాత: ప్రశాంత్

క్రియేటివ్ డైరెక్టర్స్: శ్రేయాస్ సిఎం, సూర్య తోరమ్స్, అపురూప

లీగల్ అడ్వైజర్: సాయి చాతుర్య అరవ

నిర్వాహకులు: మహర్షి నీల & హరిప్రియ మొదలవలస

డి ఓ పి: భాను తేజ

లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ బాల

ఈ ఆటలో పాల్గొనాలి అంటే www .theluck .world లో రిజిస్టర్ అవ్వాలి. దేశంలోనే సామాన్యుల కోసం
ఏర్పడిన తొలి అతిపెద్ద రియాలిటీ షో.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.