English | Telugu

బన్నీ, త్రివిక్రమ్ సోషియో ఫాంటసీ ఫిల్మ్.. అంతకుమించి!

హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి చేతులు కలిపారు. వీరి కలయికలో వచ్చిన 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా విజయం సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని సాధించి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. అలాంటి హిట్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది.

గురు పూర్ణిమ శుభ సందర్భంగా ఈరోజు(జూలై 3) బన్నీ-త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గత మూడు సినిమాలనూ నిర్మించిన హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థనే ప్రొడక్షన్ నెం.8 గా ఈ సినిమాని కూడా భారీ స్థాయిలో నిర్మించనుంది. గీతా ఆర్ట్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం కానుంది. ఈ చిత్రాన్ని పద్మశ్రీ అల్లు రామలింగయ్య మరియు శ్రీమతి మమత సమర్పణలో హారిక & హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'అల వైకుంఠపురములో' తర్వాత హారిక & హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ మరోసారి చేతులు కలపడం విశేషం.

ఈ సినిమాని ఈరోజు ఉదయం 10:08 గంటలకు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు. గత చిత్రాలను మించి అత్యంత భారీ స్థాయిలో అద్భుతమైన అనుభూతిని పంచే చిత్రాన్ని అందించబోతున్నామని వీడియో ద్వారా తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'గుంటూరు కారం' చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప-2' చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక బన్నీ-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కనున్న నాలుగో సినిమా పట్టాలెక్కనుంది. కాగా ఇది పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ అని ఇన్ సైడ్ టాక్.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.