English | Telugu

ఓజి కోసం లండన్ లో 117 మంది సంగీతం  

'ఓజి'(Og)ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో కానీ, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని ఏర్పరుచుకుంది. ఈ చిత్రానికి పని చేస్తున్న వాళ్లంతా పలు రకాల ఇంటర్వూస్ లో మాట్లాడుతు 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' నటనలో దాగి ఉన్న మరో కొత్త రూపాన్ని పరిచయం చేస్తున్న చిత్రంగా ఓజి నిలవబోతుందని చెప్తున్నారు. దీంతో అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25 దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెరగనుంది.

ఇక కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా వేదికగా థమన్(Thaman)ఇస్తున్న 'ఓజి' అప్ డేట్స్ ఫ్యాన్స్ లో జోష్ ని తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే 'జపాన్(japan)దేశపు సాంప్రదాయ వాయిద్య పరికరం 'కోటో'(Koto)ని ఉపయోగించి 'బిజీఎం' చేసానని థమన్ రెండు రోజుల క్రితం ఎక్స్ లో ట్వీట్ చేసాడు.దీంతో ఓజి మ్యూజిక్ విషయంలో థమన్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో తెలుస్తుంది. రీసెంట్ గా థమన్ మరో సారి సోషల్ మీడియా వేదికగా వేదికగా స్పందిస్తు 'లండన్ లోని ఒక స్టూడియోలో ఓజి రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం 117 మంది సంగీత కళాకారులు వర్క్ చేస్తున్నారనే ట్వీట్ చేసాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా షేర్ చెయ్యగా, ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. దీంతో మ్యూజిక్ విషయంలో 'ఓజి' సరికొత్త రికార్డులు నమోదు చెయ్యడం గ్యారంటీ అని ఫ్యాన్స్ తో మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

గ్యాంగ్ స్టార్ డ్రామాగా 'ఓజి' తెరక్కుతుండగా, ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలతో పాటు సాంగ్స్ ఎంతో ప్రెష్ గా ఉన్నాయి. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగబోతుంది.ట్రైలర్ కూడా అప్పుడే రిలీజయ్యే ఛాన్స్ ఉంది. పవన్ సరసన ప్రియాంక మోహన్(Priyanka Mohan)జత కట్టగా, ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)విలన్ గా పరిచయం కాబోతున్నాడు. దానయ్య, దాసరి కళ్యాణ్ లు పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతోనే నిర్మించగా సుజీత్ దర్శకుడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.